
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవినాయక్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 18 వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 4,074 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,259 ఓట్లు రాగా 18వ రౌండ్ లో టీఆర్ఎస్ 1,851 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.