Site icon OkTelugu

మంత్రి క్వారీలో పేలుడు.. కూలీ మృతి

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కడియాలకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ ఆర్ కనస్ట్రక్షన్ కంపెనీ కంకర రాళ్ల క్వారీ నుంచి రాయి వచ్చి తగలడంతో ఓ వ్యవసాయ కూలీ చనిపోయాడు. క్వారీకి సమీపంలోని తోలటో మామిడి కాయలు కోసేందుు కూలీలొచ్చారు. వీరు మామిడితోటలో ఉన్న సమయంలో క్వారీలో పేలుడు జరుగుతుందని సమాచరం ఇచ్చారు. దీంతో కూలీలు ట్రాక్టర్ లో బయలు దేరుతున్న సమయంలోనే క్వారీలో పేలుడు జరిగి ఓ రాయి దూసుకు వచ్చింది. జహీర్ అనే వ్యక్తికి బంలంగా రాయి తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version