Delhi exit polls : ఢిల్లీ రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత రెండు పర్యాయాలు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచే ఆప్ దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. వాటి ద్వారా విజయవంతమైనది కూడా.. ఢిల్లీలో అధికారంలో ఉంటూనే పంజాబ్లో ఆప్ అధికారంలోకి వచ్చింది.. హర్యానాలో సీఎం పీఠాన్ని దక్కించుకుంటామని స్పష్టం చేసింది. గుజరాత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని చెప్పింది..కానీ అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. చివరికి ఆప్ ఢిల్లీ, పంజాబ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. అయితే ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. బుధవారం ఎన్నికలు పూర్తయిన తర్వాత అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. దీని ప్రకారం ఆప్ ఈసారి అధికారానికి దూరమవుతుందని స్పష్టం చేశాయి. అయితే ఈ సర్వేల కంటే భిన్నంగా కేకే సర్వే తన ఫలితాన్ని అందించింది. ఢిల్లీ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కుతుందని స్పష్టం చేసింది.
కేకే సర్వే లో ఏం చెప్పిందంటే..
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో 39 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని కేకే సర్వే ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి 22 స్థానాలు వస్తాయని ప్రకటించింది.. అయితే ఈ నెల 8న ఢిల్లీ ఫలితాలు విడుదలవుతాయి.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. హర్యానాలో మాత్రం విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. అన్ని సర్వే సంస్థలను కాదని కేకే సర్వే ఢిల్లీ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంటుందని చెప్పడం సంచలనంగా మారింది. కేకే సర్వే విభిన్నమైన ఫలితాలను ఇవ్వడంతో ఓటర్లు కూడా ప్రతి ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకే సర్వే పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఢిల్లీ లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు.. కేకే సర్వే మినహా మిగతా అన్ని సంస్థలు ఆప్ కు వ్యతిరేకంగా.. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించడం విశేషం. కేకే సర్వే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలకు అందకుండా ఉంది. యువత, మహిళలు ఆప్ కుఅత్యధికంగా ఓట్లు వేశారని ప్రకటించింది.. దక్షిణ భారతదేశానికి చెందిన చాలా మంది చీపురు కట్టకు జై కొట్టారని చెప్పింది. అందువల్లే తమ సర్వేలో ఆప్ కు గణనీయమైన ఓటు బ్యాంకు లభించిందని కేకే సర్వే వెల్లడించింది. అయితే మిగతా వర్గాల వారు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వైపు చూసినప్పటికీ.. వారు విజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండాలని కే కే సర్వే ప్రకటించింది
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Delhi exit polls kk survey creates sensation on delhi seat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com