
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,18,427 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,028 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,19,865కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,627కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,489 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,01,184కి చేరింది.