
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశ వ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483 గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రికవరీ కేసులు 3,12,93,062 కాగా, యాక్టివ్ కేసులు 4,05,513గా ఉన్నాయి. వైరస్ వల్ల దేశంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470 గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది.