
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మూడు రాజధానుల ఏర్పాటుపై సహకరించాలని అమిత్ షాను కోరే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదల పై జలశక్తి మంత్రితో జగన్ చర్చించనున్నారు. కొవిడ్ దృష్ట్యా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేయాలని జగన్ కోరుతున్న నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధన్యం సంతరించుకుంది.