భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాలకవర్గంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. భారత్ కు వీలైనంత త్వరగా సాయం అందజేయాలని శ్వేతసౌధానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సహా ఇతర కొవిడ్ టీకాలు అవసరమైన వైద్య సామగ్రి పంపాలని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు ప్రముఖ భారతీయ అమెరికన్లు బైడెన్ ప్రభుత్వాన్ని కో్రారు.