పారాలింపిక్స్ లో భారత్ కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్ విజయం సాధించింది. జాంగ్ మియావోపై 3-2 తేడాతో సత్తా చాటింది. దీంతో ఫైనల్ కు చేరిన భవీనా భారత్ కు ఓ పతకం ఖరారు చేసింది. పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్ ప్రయాణం పలువురికి ఆదర్శం.