
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు బెయిల్ రద్ద చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. కేసులో ఏపీ సీఎం జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్ పై ఈ నెల 7న విచారణ జరగ్గా కౌంటర్ దాఖలుకు కోర్టును, సీబీఐ అధికారులను జగన్ సమయం కోరారు. దీంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.