
భారత్ కు థాయ్ లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. సామాజిక సేవ బాధ్యతలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయ్ లాండ్ నుంచి ఆక్సిజన్ టాంకర్లను భారత్ కు దిగుమతి చేస్తోంది.