కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా వివిధ స్థాయిల విద్యార్థులకు పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్టు పరిధిలోని పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.