బరాక్ ఒబామాపై కేసు నమోదు..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత్ లో కోర్టులో పిల్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒబామా పుస్తకం ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్‘పుస్తకంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇవి ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గ్యాన్ ప్రకాశ్ శుక్లా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఒబామాకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లోని సివిల్ కోర్టులో పిల్ వేశారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ నమోదు […]

Written By: Suresh, Updated On : November 19, 2020 5:45 pm
Follow us on

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత్ లో కోర్టులో పిల్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒబామా పుస్తకం ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్‘పుస్తకంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇవి ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గ్యాన్ ప్రకాశ్ శుక్లా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఒబామాకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లోని సివిల్ కోర్టులో పిల్ వేశారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఒబామా రాసుకున్న ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ లో సోనియా గాంధీ, మన్మోహన్ గురించి కూడా ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి ఇబ్బందులు రాకూడదనే సోనియా మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేశారని ఆయన పుస్తకంలో రచించారు.