Virat Kohli most valuable celebrity: భారత దేశంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు. క్రీడలు, సినిమాలు, వ్యాపారం, వ్యవసాయం, కళలు ఇలా అనేక రంగాల నుంచి అనేక మంది ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. అయితే దేశంలో విలువైన సెలబ్రిటీ ఎవరు అన్నది వారి ఆదాయం ఆధారంగా ఉంటుంది. దీనిని గుర్తించేందుకు ఫార్చూన్ ఇండియా ఇంటర్బ్రాండ్తో కలిసి తొలిసారిగా చేపట్టిన ‘ఇండియా’స్ మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీస్’ స్టడీలో విరాట్ కోహ్లీ అగ్రస్థానం సాధించారు. అతని బ్రాండ్ వాల్యూ రూ.3,542 కోట్లుగా నిర్ధారణ అయింది. ఇది ఎంతగా అనుసరిస్తారు, ఏ స్టార్ బ్రాండ్లకు నిజమైన విలువనిస్తారు అనేది స్పష్టంగా చెప్పే ఒక మైలురాయి.
కోహ్లీ టాప్..
క్రికెటర్ విరాట్ కోహ్లీ సాధించిన ఈ స్థానం ఆయన క్రికెట్ ప్రదర్శన మాత్రమే కాదు. అతని ఫిట్నెస్ జీవనశైలి, స్థిరత్వం, గ్లోబల్ అప్పీల్, సోషల్ మీడియా ప్రభావం (270 మిలియన్ ఫాలోవర్లు), ప్రీమియం బ్రాండ్లతో దీర్ఘకాలిక సంబంధాలు ఇవన్నీ కలిసి అతన్ని భారతదేశ అత్యంత శక్తివంతమైన బ్రాండ్గా నిలిపాయి. ఇంటర్బ్రాండ్ పద్ధతిలో బ్రాండ్ వాల్యూను నిర్ణయించేటప్పుడు కేవలం పాపులారిటీ లేదా ఆదాయం మాత్రమే కాకుండా డిస్టినెక్టివ్నెస్, రిలవెన్స్, ఎంగేజ్మెంట్, ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలను కూడా పరిగణించారు. ఈ అన్ని పారామీటర్లలోనూ కోహ్లీ టాప్లో నిలిచారు.
టాప్ 20 ర్యాంకులు ఇలా..
1. విరాట్ కోహ్లీ
2. షారుఖ్ ఖాన్
3. ప్రియాంక చోప్రా జోనాస్
4. మహేంద్ర సింగ్ ధోనీ
5. రణవీర్ సింగ్
6. అక్షయ్ కుమార్
7. అమితాబ్ బచ్చన్
8. సచిన్ తెండుల్కర్
9. ఆలియా భట్
10. అల్లు అర్జున్
11. దీపికా పదుకొణె
17. రష్మిక మందన్న
టాప్లో క్రికెటర్లు…
టాప్–10లో మూడు స్థానాలు (కోహ్లీ, ధోనీ, సచిన్) క్రికెటర్లది కావడం భారతదేశంలో క్రికెట్పై ఉన్న అపారమైన ఆధారణ, సామాజిక–ఆర్థిక ప్రభావాన్ని మరోసారి నిరూపిస్తోంది. బాలీవుడ్ సూపర్స్టార్ల కంటే క్రికెట్ ఐకాన్లు బ్రాండ్గా ఎక్కువ విలువనిస్తున్నారు.
బలంగా బాలీవుడ్
బాలీవుడ్ ఇంకా బలంగానే ఉంది, కానీ సవాళ్లు ఎదుర్కొంటోంది. షారుఖ్, ప్రియాంక, రణవీర్, అక్షయ్, అమితాబ్, ఆలియా వంటి స్టార్లు టాప్–10లో స్థానం సంపాదించడం బాలీవుడ్ ఇప్పటికీ బలమైన బ్రాండ్ శక్తిని కలిగి ఉందని చెబుతోంది. ముఖ్యంగా ప్రియాంక గ్లోబల్ ఇమేజ్ ఆమెను మూడో స్థానానికి చేర్చింది.
పాన్ ఇండియా స్టార్లుగా దక్షిణాది యాక్టర్లు..
అల్లు అర్జున్ 10వ స్థానం, రష్మిక మందన్న 17వ స్థానం సాధించడం దక్షిణ భారత సినిమా (ముఖ్యంగా తెలుగు–కన్నడ) జాతీయ స్థాయి ప్రభావాన్ని సూచిస్తోంది. ఇది భారతదేశ ఎంటర్టైన్మెంట్ ల్యాండ్స్కేప్ మారుతోందని తెలియజేస్తుంది.
ఫార్చూన్–ఇంటర్బ్రాండ్ స్టడీ భారతదేశంలో సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ ఎలా కొలవాలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానం సాధించడం ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ నిజమైన బ్రాండ్ వాల్యూ కేవలం పాపులారిటీ లేదా ఫాలోవర్ల సంఖ్యపై మాత్రమే ఆధారపడదు. అది స్థిరత్వం, విశ్వసనీయత, సామాజిక ప్రభావం, ఆధునిక భారతీయ యువత ఆశించే విలువలపై ఆధారపడి ఉంటుంది.
