spot_img
Homeజాతీయ వార్తలుCM Vijay: హైకోర్టుకు ఎదురెళ్లి సవాల్ చేసిన విజయ్..ఇది మాములు సంచలనం కాదు

CM Vijay: హైకోర్టుకు ఎదురెళ్లి సవాల్ చేసిన విజయ్..ఇది మాములు సంచలనం కాదు

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి అక్కడి ప్రతిపక్షం చేస్తున్న వ్యవహారాన్ని ఇటీవల బట్ట బయలు చేశారు. అంతటితోనే విజయ్ ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా అక్కడి న్యాయస్థానానికే ఎదురు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ తీర్పును మద్రాస్ హైకోర్టు తన పరిధిని దాటి ఇచ్చిందని టీవీకి నేతలు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడల వధకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంపూర్ణ నిషేధాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ప్రభుత్వం హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

గత నెల 27న మద్రాస్ హైకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రంలో బక్రీద్ తో పాటు ఇతర పండగల సందర్భంగా జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విజయ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తనదైన వాదనలు వినిపించింది.. 1958 నుంచి తమిళనాడు రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టం అమల్లో ఉందని.. దాని ప్రకారం 10 సంవత్సరాల పైన ఉండి.. సంతాన ఉత్పత్తికి పనికిరాని జంతువులను మాత్రమే వధించడానికి అనుమతి ఉంది. మద్రాస్ హైకోర్టు దీనిని పక్కన పెట్టింది. సంపూర్ణ నిషేధాన్ని విధించడం ఏకంగా న్యాయస్థానాల పరిధి దాటి వ్యవహరించడమేనని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కోయంబత్తూర్ లాంటి ప్రాంతంలో బక్రీద్ లాంటి పండుగ జరిగినప్పుడు బహిరంగ ప్రదేశాలలో జంతువులను చంపడాన్ని నిషేధించాలని మాత్రమే పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.. పిటిషనర్ అడగకుండానే పూర్తి నిషేధాన్ని విధించడం సరికాదని సుప్రీంకోర్టు దృష్టికి తమిళ్నాడు ప్రభుత్వం తీసుకెళ్లింది.

తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి పార్టీలు స్వాగతించడం లేదు. కోర్టుల పరిధి దాటి తీర్పులు ఇవ్వకూడదని.. మత సంప్రదాయాలను తొక్కిపెట్టకూడదని తమిళనాడు రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు.. పాలు ఇచ్చే ఆవులను ఎవరూ చంపరని.. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు అనేక రకాలుగా ప్రభావం చూపిస్తోందని అక్కడి రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు. కేవలం ముస్లింలు మాత్రమే జంతువులను వధించరని.. హిందువులు కూడా వారి పండుగ సమయంలో జంతువులను చంపుతారని.. కోర్టు ఇచ్చిన నిబంధనలు స్థానికంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలగజేస్తోందని అక్కడి రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కేవలం లైసెన్స్ పొందిన కసాయి కేంద్రాలలో మాత్రమే జంతువులను చంపాలి అని అనడం సరికాదని.. పండుగ సమయంలో డిమాండ్ తట్టుకునే సామర్థ్యం కసాయి కేంద్రాలకు లేదని అక్కడి పార్టీల నేతలు చెబుతున్నారు. అధికార టీవీకే పార్టీ స్పందించిన తీరు పట్ల కొంతమంది స్వాగతిస్తుండగా.. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అంశంపై చాలా ఆలస్యంగా టీవీకే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని.. అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటుంటే.. సున్నితమైన అంశం కాబట్టి.. అనేక రకాలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని టీవీకే నేతలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version