Homeజాతీయ వార్తలుIndia Turkey Relations: పాక్ ను చూసి ఎగిరిపడింది.. ఇప్పుడేమో టర్కీ కాళ్ల బేరానికి వచ్చింది.....

India Turkey Relations: పాక్ ను చూసి ఎగిరిపడింది.. ఇప్పుడేమో టర్కీ కాళ్ల బేరానికి వచ్చింది.. నరేంద్ర మోడీతో అట్లుంటది మరి

India Turkey Relations: అరచిన వాడు గొప్పవాడు కాదు. నిశ్శబ్దంగా ఉన్నవాడు మూర్ఖుడు కాదు.. టర్కీ మొన్నటి దాకా పాకిస్తాన్ కు వంత పాడింది. అంతటి భూకంపం లో కూడా భారత్ సహాయం చేస్తే ఆ విషయాన్ని కూడా మర్చిపోయి.. జమ్ము కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ను విపరీతంగా సపోర్ట్ చేసింది. అంతర్జాతీయ వేదికలలో పాకిస్థాన్ దేశాన్ని వెనకేసుకొచ్చింది. మన దేశం మీద లేనిపోని విమర్శలు చేసింది. వీటన్నిటినీ కూడా భారత్ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. టర్కీ మాదిరిగా అరవలేదు.. అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడలేదు.

భారత్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి.. పాకిస్తాన్ దేశానికి వంత పాడిన టర్కీకి ఇప్పుడు అసలు విషయం అర్థమవుతోంది. మధ్య ఆసియాలో యుద్ధాలు.. ఆర్థికంగా ఒత్తిడి.. పర్యాటక రంగంపై తీవ్రమైన ప్రభావం.. ఇవన్నీ కూడా టర్కీ దేశాన్ని తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ఇన్నాళ్లపాటు భారతదేశంతో విరోధం కొనసాగించిన టర్కీ ఇప్పుడు ఆకస్మాత్తుగా స్నేహం గుర్తుకొచ్చింది. అందువల్లే భారతదేశంతో మిత్రమా రా.. నాతో చేతులు కలుపు అన్నట్టుగా సంకేతాలు ఇస్తుంది. అయితే దీనిని భారత్ సరిగా పట్టించుకోవడం లేదు. టర్కీ బుద్ధి వచ్చేలా చేసేందుకు భారతదేశం గట్టిగా అరవలేదు.. ప్రపంచ వేదికల ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడలేదు. కేవలం లెక్కలు మాత్రమే వేసింది. ఆ లెక్కలు టర్కీ మొత్తాన్ని కదిలించాయి. లేని భూకంపాన్ని తెప్పించాయి. దీంతో టర్కీ కి ఇండియా అంటే ఏంటి.. నరేంద్ర మోడీ అంటే ఏంటో తెలిసింది. అందువల్లే కాళ్ళ బేరానికి వచ్చింది.

చైనాలో యుగర్ ముస్లింల మీద దాడి చేస్తుంటే టర్కీ మాట్లాడలేదు. ఇరాన్, యోమన్, ఇరాక్ దేశాలలో ముస్లింలు చనిపోతుంటే టర్కీ మాట్లాడలేదు. కానీ కాశ్మీర్ విషయంలో మాత్రం గొంతు సవరించుకుంది. భారతదేశం మీద విష ప్రచారం చేసింది. భారత్ సైలెంట్ గా ఆర్మీనియా వైపు నడిచింది. సైప్రస్ మీద దృష్టి సారించింది. అంతేకాదు అత్యంత ఆధునికమైన ఆయుధాలను ఈ రెండు దేశాలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో భారత్ తనకు తెలియకుండానే తనకింద మంట పెడుతుందని టర్కీ కి అర్థమైంది. అందువల్లే ఇన్నాళ్లపాటు సాగించిన విరోధాన్ని.. శత్రుత్వాన్ని మర్చిపోయింది. స్నేహ హస్తాన్ని చాచింది.

టర్కీని భారత్ నమ్మదు. అంతటి భూకంపం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు భారత్ మాత్రమే టర్కీలో సహాయం చేసింది. మందుల నుంచి మొదలుపెడితే ఆహారం వరకు సరఫరా చేసింది. ఇవన్నీ మర్చిపోయి టర్కీ పాకిస్తాన్ దేశానికి జై కొట్టింది. దీనిని మనసులో పెట్టుకున్న భారత్ ఆర్మీనియా, గ్రీస్, సైప్రస్ దేశాలతో మాట్లాడింది. డిఫెన్స్ సహకారం పెంచింది.. ఫలితంగా టర్కీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఆకాష్ యాంటీ మిస్సైల్ సిస్టమ్స్.. ఫినాక రాకెట్ లాంచర్స్.. స్వాతి రాడార్లు.. బ్రహ్మోస్.. ప్రళయ్ మిస్సైల్స్.. ఇవన్నీ కూడా ఇచ్చేస్తోంది. దీంతో టర్కీ అన్ని మూసుకుంది. నాతో కలువు అంటూ భారతదేశానికి సంకేతాలు పంపిస్తోంది. టర్కీ మాటలు భారత్ వింటుందా నెవర్.. ఎందుకంటే ఆ దేశం పాము లాంటిది.. పాలు పోసినా సరే విషమే చిమ్ముతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular