spot_img
Homeజాతీయ వార్తలుTMC merger with Congress: టీఎంసీ అంతర్దానం.. కాంగ్రెస్ పార్టీలో విలీనం.. పాపం మమతకు ఎంత...

TMC merger with Congress: టీఎంసీ అంతర్దానం.. కాంగ్రెస్ పార్టీలో విలీనం.. పాపం మమతకు ఎంత గతి పట్టింది

TMC merger with Congress: ఒక్క ఓటమి.. ఒకే ఒక్క ఓటమి మమతా బెనర్జీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. తను ఓడిపోవడం మాత్రమే కాదు.. 15 సంవత్సరాలుగా పరిపాలించిన తన పార్టీ కూడా ఓడిపోవడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇండియా కూటమిని లీడ్ చేసే స్థాయి నుంచి సోనియా చెప్పు చేతుల్లోకి వెళ్లే స్థాయికి మమత దిగజారిపోయింది.

ఇటీవల ఇండియా కూటమి మీటింగ్ జరిగింది. ఒకప్పుడు ఇండియా కూటమి మీటింగ్ జరిగితే మమతకు అగ్రస్థానం ఇచ్చేవారు. మమతకు విపరీతమైన గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా మమత మీద కుళ్ళు జోకులు వేశారు. అంతేకాదు మొన్నటికి మొన్న మీ అల్లుడి మీద గుడ్లతో దాడి చేశారు కదా.. అతనికి ఏమైనా గాయాలయ్యాయా.. ఇదిగో ఇలా మమతను టీజ్ చేశారు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు. వారి మాటలకు మమత బెనర్జీ తీవ్రంగా నొచ్చుకుంది. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. మమత మౌనాన్ని ఆసరాగా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏకంగా ఆమె రాజకీయ భవితవ్యానికే స్కెచ్ వేశారు.

పశ్చిమ బెంగాల్లో ఇప్పట్లో టి ఎం సి అధికారులకు వచ్చే అవకాశాలు లేవు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా లేవు. ఆమె మేనల్లుడు మీద ప్రజలు దాడులు చేస్తున్నారు. మంత్రులను కూడా వదిలిపెట్టడం లేదు. ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. రిత బ్రత బెనర్జీ వేరే కుంపటి పెట్టాడు. ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు అతడి చేతిలో ఉన్నారు. ఈ లెక్కన మమత పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ మమత ముందు ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేయాలని సూచించినట్టు సమాచారం. అయితే దీనిపై మమత కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది.. బిజెపి నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నుంచి తట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని మమతకు సోనియాగాంధీ సూచించినట్టు తెలుస్తోంది.. కాగా అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ కావడం.. ఈ విలీనం వ్యవహారానికి బలం చేకూర్చుతోంది.

సరిగ్గా 28 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగిన ఆమె.. సరిగా 1998లో కాంగ్రెస్ పార్టీతో విభేదించింది. ఆ తర్వాత టీఎంసీ పార్టీని ఏర్పాటు చేసింది.. బెంగాల్ రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. కాగా, ఈ విలీనం పట్ల టీఎంసీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో దారుణం చేసిన పార్టీలోకి ఎలా వెళ్లిపోతామని మండిపడుతున్నారు. సోనియాగాంధీ ఆఫర్ ఇచ్చిన అంతమాత్రాన ఆ పార్టీలో చేరేది లేదని టీఎంసీ కార్యకర్తలు అంటున్నారు. మరి దీనిపై మమత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version