టీచర్ పోస్టుల భర్తీ విసయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగాఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేయాలని భావించింది. విద్యార్థులు లేని పాఠశాలల్లో ఖాళీగాఉన్న వాటిని భర్తీ చేయకూడదని సంకల్పించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశం లేదు. విద్యార్థులు లేని స్కూళ్లలో టీచర్ల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలోనే విద్యార్థులు లేని స్కూళ్లలోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాలల్లో 2 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.
ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్తాయిలోనే ఉన్నట్లు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ర్టంలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగాఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచర్ కు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మంది హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థఉలుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది.