Homeజాతీయ వార్తలుSuccess story meet Raju Lahoria: ఆ ఒక్క సలహాతో.. గుర్రాలతో లక్షల ఆదాయం..

Success story meet Raju Lahoria: ఆ ఒక్క సలహాతో.. గుర్రాలతో లక్షల ఆదాయం..

Success story meet Raju Lahoria: మనం చేసే పని మీద ఇష్టం ఉంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాన్ని సాధించగలడని మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు లహోరియా నిరూపించాడు. Madhya Pradesh రాష్ట్రంలోని Khandwa district పరిధిలోని అహ్మద్‌పూర్ ఖేగావ్ గ్రామానికి చెందిన రాజు.. చదువులో వెనుకబడినా.. డబ్బు సంపాదించడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఆసక్తిని వ్యాపారంగా మార్చుకొని ఇప్పుడు మంచి ఆదాయం సంపాదిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నేటి యూత్ కు ఏంతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ రాజు గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

రాజు లహోరియా దాదాపు 10 ఏళ్ల క్రితం రాజు గుజరాత్ నుంచి రూ.3.5 లక్షల భారీ వ్యయంతో ఒక మార్వారీ జాతి ఆడ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. మొదట్లో అది కేవలం తన ఇష్టానికి మాత్రమే పెంచుకున్నాడు. అయితే ఒక రోజు ఓ పూజారి ఇచ్చిన సలహా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ‘ఈ గుర్రాన్ని పెళ్లి వేడుకలకు పంపించు.. మంచి ఆదాయం వస్తుంది’ అని చెప్పడంతో రాజు తొలిసారి తన గుర్రాన్ని ఓ వివాహానికి పంపించాడు.

ఆ ఒక్క ప్రయత్నమే రాజుకు ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లిలో గుర్రం ఆకర్షణగా నిలవడంతో వరుసగా బుకింగ్‌లు రావడం ప్రారంభమైంది. దీంతో రాజుకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మరిన్ని గుర్రాలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతని వద్ద ‘లక్ష్మి’ అనే ప్రత్యేకమైన మార్వారీ జాతి ఆడ గుర్రం ఉంది. ఈ గుర్రం అందంగా ఉండటమే కాకుండా పెళ్లిళ్లలో సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పెళ్లికొడుకు ఇచ్చే ఆదేశాలను కూడా సులభంగా పాటిస్తుండటంతో దీని డిమాండ్ మరింత పెరిగింది.

Marwari horse జాతి గుర్రాలు వాటి ప్రత్యేకమైన రూపం, తెలివితేటలు, శిక్షణకు త్వరగా అలవాటు పడే స్వభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. రాజు వద్ద ఉన్న గుర్రాలకూ ఇదే ప్రత్యేకత కలిసి రావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే 3 నుంచి 4 నెలల ముందే బుకింగ్‌లు పూర్తవుతున్నాయి. అప్పట్లో రూ.3.5 లక్షలకు కొనుగోలు చేసిన గుర్రం విలువ ఇప్పుడు మార్కెట్లో సుమారు రూ.5 లక్షల వరకు పెరిగిందని చెబుతున్నారు.

ఈ వ్యాపారంలో ఖర్చులు ఉన్నప్పటికీ మంచి లాభాలు వస్తున్నాయని రాజు చెబుతున్నాడు. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తారు. అదే నగరాల్లో జరిగే పెద్ద పెళ్లిళ్లకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఏడాదికి సుమారు 70 నుంచి 80 పెళ్లి బుకింగ్‌లు వస్తుండటంతో అన్ని ఖర్చులు పోను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నికర ఆదాయం వస్తోందని రాజు తెలిపాడు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version