Nisarg Adhikari CBSE: మనం సాధారణంగా ప్రభుత్వ వెబ్ సైట్ లకు అత్యంత పట్టిష్టమైన ఫైర్ వాల్స్ ఉంటాయి కాబట్టి.. అందులో ఎటువంటి లోపాలూ ఉండవని అనుకుంటాం. అవి అత్యంత పటిష్టంగా పనిచేస్తాయనుకుంటాం. పైగా కఠినమైన నిబంధనల వల్ల మనం ప్రభుత్వ సైట్ల జోలికి వెళ్లే సాహసం చేయం.. కానీ ఓ 19 సంవత్సరాల బాలుడు మాత్రం ఈ పని చేశాడు.
ఇటీవల సీబీఎస్ఈ మార్కుల అప్లోడ్ విధానంలో చోటు చేసుకున్న లోపాలను నిసర్గ అధికారి అనే యువకుడు బయటపెట్టాడు. భద్రతా లోపాలను కూడా అతడు వివరించాడు. అతడు బయటపెట్టిన తీరు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అనేకమంది ప్రముఖులు.. నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇతడి ప్రతిభను ఐఐటి కాన్పూర్ ప్రత్యేకంగా గుర్తించింది. అంతేకాదు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ.. సైబర్ డిఫెన్స్ పరిశోధన కేంద్రం C3iHub లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) , అండ్ థ్రెట్ ఇంటలిజెన్స్ ఇంజనీర్ గా ఉద్యోగం కల్పించింది.
నిసర్గ ఒక సాధారణ సైబర్ రీసెర్చర్. తన ప్రతిభతో దేశంలోనే హై ఎండ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగం సాధించడం మామూలు విషయం కాదు..C3iHub అనేది కాన్పూర్లో అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ పరిశోధన కేంద్రం.. అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఇది పని చేస్తూ ఉంటుంది.. సైబర్ దాడులు.. డేటా ప్రొటెక్షన్.. హ్యాకింగ్ లాంటి అంశాలపై ఇక్కడ ప్రతిరోజు పరిశోధనలు సాగుతూ ఉంటాయి.. నిసర్గకు ఇక్కడ క్లాస్ లు.. బోధనలోనే కాకుండా.. రిసర్చ్ వింగ్ లో కూడా ఉంటాడు. గవర్నమెంట్.. బ్యాంకింగ్.. డిఫెన్స్ సిస్టం వంటి వాటికి డిజిటల్ ప్రొటెక్షన్ ఎప్పటికప్పుడు మెరుగుపరచడం.. సైబర్ అటాక్స్ నుంచి ముందుగానే రక్షణ కల్పించడం వంటివి ఇతడి విధి.. ఈ డిపార్ట్మెంట్లో పని చేసే వారికి నెలకు 50 నుంచి 1.2 లక్షల వరకు వేతనం ఇస్తూ ఉంటారు. అయితే నిసర్గ విషయంలో ప్యాకేజీ వేరే విధంగా ఉంటుంది. అతడికి ప్రతి నెలకు దాదాపు మూడు లక్షల వరకు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది.
నేటి కాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు కొత్త కొత్త విధానాలలో దాడులు చేస్తున్నారు. ఇలాంటి అప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డేటా చోరీలు.. బెదిరింపులు వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. అందువల్లే నైపుణ్యం ఉన్న యంగ్ ఎక్స్పర్ట్స్ కు డిమాండ్ ఉంది. ప్రభుత్వ విభాగాలలో లోపాలను ఎత్తిచూపిన వారికి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. నిసర్గ కూడా అలానే అవకాశం దక్కించుకొని.. ఏకంగా ఈ స్థాయికి దాకా ఎదిగాడు.

