Site icon OkTelugu

Nirmala Sitharaman: ఆ రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సితారామన్..!

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ 2024ను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జూలై 22న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మోడీ 3.O అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించిన మొదటి సమగ్ర బడ్జెట్ ఇదే. లోక్ సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది.
సాగు రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలు ఊపందుకోవడం, ఆర్థిక ఏకీకరణ మార్గాన్ని కొనసాగించేందుకు ఆదాయ వృద్ధిని పెంచడం వంటి అంశాలకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని సరళీకృతం చేయడం. పన్ను సమ్మతి భారాన్ని తగ్గించడం కూడా ప్రభుత్వ ఎజెండాలో భాగమని భావిస్తున్నారు. రాబోయే బడ్జెట్ 2024లో ప్రధాని నరేంద్ర మోడీ తన బృందాన్ని రూపొందించాలని సూచించిన 100 రోజుల ప్రణాళికలోని అంశాలను పొందుపరిచే అవకాశం ఉంది.

అదనంగా, ప్రభుత్వం దాని ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్-PLI) పథకాలను తోలు పరిశ్రమa వంటి మరింత శ్రమతో కూడుకున్న రంగాలకు కూడా చేర్చాలని భావిస్తోంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడో సారి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఫిబ్రవరి-2024లో సమర్పించిన బడ్జెట్ ఏప్రిల్-మే మధ్య షెడ్యూల్ చేయబడిన లోక్‌ సభ ఎన్నికల కారణంగా మధ్యంతర బడ్జెట్ ఆరోసారి ప్రవేశపెట్టింది.

మధ్యంతర బడ్జెట్‌లో, ప్రభుత్వం వృద్ధిని ప్రోత్సహించడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంపొందించడం, సమాజంలోని వివిధ వర్గాల కోసం అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఆర్థిక విధానాలను ఇందులో ప్రవేశపెట్టారు.

బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో సహా తూర్పు ప్రాంతాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినవిగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా వాటిని గ్రోత్ ఇంజిన్‌లుగా మార్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ అంశాలతోనే ఈ సారి బడ్జెట్ ఉండబోతోందని తెలుస్తోంది.

Exit mobile version