Narendra Modi South India Parliament Seats: దక్షిణది రాష్ట్రాలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. కొంతకాలంగా కొంతమంది రాజకీయ నాయకులు దక్షిణాది మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కెసిఆర్ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు దక్షిణాది రాష్ట్రాలను నరేంద్ర మోడీ పట్టించుకోవడంలేదని.. పార్లమెంటు స్థానాల పెంపు విషయంలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై బీజేపీ సరిగా కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు బిజెపి తీసుకొచ్చిన ప్లాన్ ఆ తరహా నాయకుల నోర్లు మూసే విధంగా ఉంది.
గతంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం తేలిపోయింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపకపోవడంతో ఆ అంశంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు అంచనాలకు మించిన బలాన్ని సొంతం చేసుకున్న తర్వాత కేంద్రం మరొకసారి డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తీసుకొస్తుంది. మన దేశంలో 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని పెంచాలని కేంద్రం భావిస్తున్నది. దీనివల్ల ప్రజలకు మరింత సమర్థవంతమైన పరిపాలన లభిస్తుందని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల పెంపు విషయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రకటించింది. కీలకమైన ప్రతిపాదనలను అందించింది.
జనాభా పెరిగినప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుంది.నియోజకవర్గాల పెంపునకు పెరిగిన జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రస్తుత జనాభా నివేదికలో పట్టణీకరణ.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచించింది. దీనివల్ల దేశంలో అన్ని ప్రాంతాలకు పరిపాలన మరింత చేరువవుతుందని.. ఆ ప్రజలకు ప్రతినిధులుగా ఎంపీలు ఉంటారని ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రకటించింది..
ఇక దేశంలో 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలను కేంద్రం అమలు చేస్తే వాటి సంఖ్య 824కు చేరుకునే అవకాశం ఉంది. పెద్ద రాష్ట్రాలలో సీట్ల పెంపు ఏకంగా 50% వరకు ఉంటుంది. చిన్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న స్థానాలను రెట్టింపు చేస్తారని సమాచారం. దీనివల్ల ఎంపీలు ప్రజలకు మరింత చేరువగా ఉంటారని తెలుస్తోంది.. ప్రధాని ఆర్థిక మండలి నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 170 పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. ఇందులో 59 నియోజకవర్గాలు రెండు భాగాలవుతాయి. 111 నియోజకవర్గాలు మూడు భాగాలవు తాయి. దీనివల్ల ప్రజలకు ఎంపీలు మరింత దగ్గరవుతారు. సమస్యలను నేరుగా పరిష్కరిస్తారు.
నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాలకు పునర్విభజనలో అదిరిపోయే కానుక ఇచ్చే అవకాశం ఉంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 20 స్థానాలు ఉండగా.. అవి 30 కి పెరుగుతాయి. తమిళనాడులో 39 నుంచి 59.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇక మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు 120కి పెరిగే అవకాశం ఉంది. అక్కడ దాదాపు 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.
కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వల్ల ప్రజల ప్రాతినిధ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ఓటింగ్ కూడా 2.3 శాతం వరకు పెరుగుతుంది. మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా మహిళల కోసం పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2027 జనాభా లెక్కల తర్వాతనే చేపట్టాలని కమిటీ ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే దేశంలో రాజకీయంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

