Site icon OkTelugu

కరోనాతో అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకున్న మోడీ

కరోనా ఎంతో మందిని చంపేసింది. ఎంతో మందిని అనాథలు చేసింది. తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నిత్యం లక్షల కేసులు, వేలసంఖ్యలో మరణాల్లో ఈ అనాతల సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా రక్తసంబంధాలను తెంచింది. పేగు బంధాలను తుంచింది.పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు ప్రధాని మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. వారి కన్నీళ్లు తుడిచేందుకు డిసైడ్ అయ్యారు.

కరోనా ప్రభావంతో గత ఏడాది నుంచి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబ పెద్ద మరణించడంతో తినడానికి తిండి లేక అలమటిస్తున్న వారు ఎందరో ఉన్నారు.

ఇలా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లల కోసం పీఎం కేర్స్ ఫర్ ‘చిల్డ్రన్ ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు.

కరోనాతో అనాథలైన పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు లేదా కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లలో ఉచితంగా వీరికి విద్య అందిస్తారు. యూనిఫామ్స్, బుక్స్ ఇతర ఖర్చులన్నీ పీఎం కేర్స్ భరిస్తుంది. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత నెల నెలా స్టైఫండ్ అందిస్తారు. చదువుతోపాటు ఇతర ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. 23 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షలు ఇస్తారు. ఉన్నత చదువుల కోసం రుణాలను ఇప్పిస్తారు. ఆ లోన్ వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పిస్తారు. దానికి పీఎం కేర్స్ నుంచే ప్రీమియం చెల్లిస్తారు.

ఇలా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ పథకం ప్రకటించి ప్రధాని మోడీ పేర్కొన్నారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Exit mobile version