spot_img
Homeజాతీయ వార్తలుLove Jihad In Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో లవ్‌ జిహాద్‌ గుట్టు రట్టు.. 300లకుపైగా...

Love Jihad In Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో లవ్‌ జిహాద్‌ గుట్టు రట్టు.. 300లకుపైగా బాధితులు

Love Jihad In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌.. మోదీ తర్వాత బలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌ సీఎంగా ఉన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు. అయినా ఇంకా అక్కడక్కడ అసాంఘిక శక్తులు ఉన్నాయి. వాటితోకలను కూడా కత్తిరిస్తున్నారు. ఈ క్రమంలో లవ్‌ జిహాద్‌ బయటపడింది.

హిందువుగా చెలామణి అవుతూ..
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఎంఐఎం కార్యకర్త అజ్వర్‌ ఉల్‌ హక్‌ ’ప్రిన్స్‌’ పేరుతో హిందువుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చేతులకు కంకనాలు, మెడలో ఎరుపురంగు మాలతో తిరుగుతూ హిందువుగా చెప్పుకుంటూ యువతులను మోసం చేశాడు. చాలామంది అమ్మాయిలను ఆకర్షించాడు. దాదాపు అతని బాధితులు వందల సంఖ్యలో ఉంటారని తెలుస్తోంది.

ఫిర్యాదుతో విచారణ..
ఇటీవల ప్రిన్స్‌ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేయగా, అతను ఎంఐఎం నాయకుడు అని తేలింది. యువతులను మోసం చేయడం పథకంలో భాగమని అనుమానిస్తున్నారు. బస్తీలో 300 మంది హిందూ యువతులు ఈ లవ్‌ జిహాద్‌కు బలైనట్లు సమాచారం. ఇది సంఘటిత రంగుల మార్పిడి ఉద్దేశ్యాన్ని సూచిస్తోంది.

పోలీసు చర్యలు..
విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పోలీసులే షాక్‌ అవుతున్నారు. ఈ ఘటన స్థానిక సమాజంలో భయాందోళన రేపింది. పోలీసులు మరిన్ని బాధితులను గుర్తించి, సంఘటిత కుట్ర ఆచరణలో ఇతరులు ఉన్నారా అని దర్యాప్తు చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version