Lady Doctor Remarks: వైద్యులను మనం దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది. మన ఎదుగుదలలో తండ్రి తోడ్పడుతుంటాడు. కానీ వైద్యులు మనకు పునర్జన్మ అందిస్తూ ఉంటారు. మనం జబ్బు పడినప్పుడు.. తిరిగి కోలుకోవడంలో సహాయపడుతుంటారు. అందువల్లే వైద్యులను కనిపించే దేవుళ్ళు అని అంటుంటాం.
ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి చాలామంది సరికొత్త వన్నె తీసుకొచ్చారు. వైద్యరంగంలో సరికొత్త మార్పులకు బీజం వేశారు. కానీ కొంతమంది వైద్యులు మాత్రం ఆ వృత్తికి తీవ్రమైన మకిలి తీసుకొస్తున్నారు. అటువంటి వారి వల్ల వైద్యులు అంటేనే సమాజం చీ కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. అయితే ఈ జాబితాలో ఈ మహిళ వైద్యురాలు అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసిన పని అంత పనికిమాలినది కాబట్టి. పైగా ఈ విషయాన్ని తనే బయటపెట్టుకుంది.
ఇటీవల కాలంలో స్టాండ్ అప్ కామెడీ షో లు పెరిగిపోయాయి. అందులో బీ గ్రేడ్ కంటెంట్ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల చాలామంది నవ్వుకుంటున్నారు గాని.. పచ్చి బూతుల వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందో మిగతా వాళ్లకు తెలుసు. ఆ వైద్యురాలు స్టాండప్ కామెడీలో లైన్ తప్పింది.. అనకూడని మాట అనేసింది.. మార్చురీలో ఉండే పురుషుల శవాల ప్రైవేట్ పార్ట్స్ పరిమాణాల మీద తాము జోకులు వేసుకుంటామని ఆ వైద్యులు చెప్పింది.. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడంతో ఆమె వెంటనే క్షమాపణ చెప్పింది..
ఇటీవల కాలంలో ఈ తరహా లేకి వ్యాఖ్యలు చేసే వారు చాలామంది పెరిగిపోతున్నారు. దానికి స్టాండ్ అప్ కామెడీ అని పేరు పెడుతున్నారు.. ఇక గురుగ్రామ్ ప్రాంతంలో ఐటీ ఇంజనీర్ గా పనిచేసే హిమాన్షు అనే వ్యక్తి.. స్టాండ్ అప్ కామెడీలో బిర్యానీ వ్యాఖ్యలు కూడా వివాదాన్ని సృష్టించాయి.”నేను ఒక అమ్మాయికి 370 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిచ్చాను.. దానికి బదులుగా ఆమె ఏమిస్తుంది.. నేను ఏం కోరుకుంటాను. శారీరక సుఖాన్నే కదా” అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడాడు.
అతడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వివాదాన్ని సృష్టించాయి. దీంతో ఆ కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. వీరు మాత్రమే కాదు అప్పట్లో కొంతమంది ఏపీ రాజకీయాల గురించి కూడా చెత్త వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ.. చంద్రబాబు మీద అడ్డగోలుగా మాట్లాడారు. వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. స్టాండప్ కామెడీ పేరుతో వీరు చేస్తున్న లేకి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి.

