Homeజాతీయ వార్తలుKolkata Gulshan Colony: కోల్‌కతా ర్యాలీ.. గుల్షన్‌ కాలనీ.. తొలిసారి ఎన్‌ఐఏ దెబ్బ!

Kolkata Gulshan Colony: కోల్‌కతా ర్యాలీ.. గుల్షన్‌ కాలనీ.. తొలిసారి ఎన్‌ఐఏ దెబ్బ!

Kolkata Gulshan Colony: దురంధర్‌ సినిమా చూసినవారికి పాకిస్తాన్‌ రాజధాని కరాచీలోని ర్యాలీ ప్రాంతం గురించి తెలిసి ఉంటుంది. ఇక్కడ జరగని అక్రమాలు లేవు. మాఫియాలు, దొమ్మీలు, దోపిడీలు, బ్లాక్‌ మార్కెట్, దాడులు, అక్రమ ఆయుధాలు, ఇలా అనేక కార్యకలాపాలకు ర్యాలీ అడ్డా. అలాంటి ప్రాంతమే మన దేశంలోనూ ఉంది. కోల్‌కతా నగరంలోని గుల్షన్‌ కాలనీ.. కోల్‌కతా ర్యాలీగా గుర్తింపు పొందింది. ఇక్కడ కూడా నేరాల అడ్డంకి మారింది. మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు, విదేశీ నగదు కడుపు, అక్రమ వలసలు, నకిలీ పత్రాల తయారీ.. ఇవి ఇక్కడి రోజువారీ వ్యాపారం. భయపెట్టి అక్రమ వసూళ్లు చేసే మాఫియా, ప్రభుత్వ అండతో దందయాట్ర చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్‌ఐఏ మొదటి దాడితో మాఫియా కార్యాలయాలు సీజ్‌ చేసింది. అనేక మందిని అరెస్టు చేసింది.

మాఫియా రూపం..
గుల్షన్‌ కాలనీ అక్రమాలకు, నేరపూరిత సామ్రాజ్యానికి అడ్డా. ఆయుధాలు, మాదకద్రవ్యాలు యువతను దెబ్బతీస్తున్నాయి. అక్రమ వలసలు, నగదు మార్పిడి, దొంగ నోట్ల చెలామణి, వంటి నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం. ఇక్కడి నుంచి నేరాలు పొరుగు ప్రాంతాల్లోకి వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ అండతోనే నేర సామ్రాజ్యం విస్తరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ముంబై ఉండర్‌వరల్డ్‌ నుంచి ఢిల్లీ గ్యాంగ్స్‌ వరకు, ఇవి సామాజిక క్షీణతకు మూలం. గుల్షన్‌ కేసు దేశపు నేర నియంత్రణ విధానానికి పరీక్ష.

ఎన్‌ఐఏ చర్యలు..
ఎన్‌ఐఏ దాడి చారిత్రకం. మొదటిసారి కేంద్ర ఏజెన్సీపై దాడి చేసింది. కార్యాలయాల సీజ్, అరెస్టులు జరిగాయి. ఆధారాలు సేకరించారు. ఇది రాష్ట్ర పోలీసుల అసమర్థతకు సంకేతం. కానీ, మాఫియా రాజకీయ సంబంధాలు బయటపడితే మరిన్ని దాడులు రావాలి. ఈ చర్యలు తాత్కాలికమే. దీర్ఘకాలిక పర్యవేక్షణ లేకపోతే నేరాలు తిరిగి బలపడతాయి.

రాజకీయ నాయకులు, పోలీసులకు సవాల్‌..
తాజా ఎన్‌ఐఏ దాడి ఇటు రాజకీయ నాయకులకు, అటు పోలీసులకు పెద్ద సవాల్‌. రాజకీయ అండ లేకుండా మాఫియా ఇంత బలపడదు. రాష్ట్ర పోలీసులు కూడా మాఫియాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు ఇప్పటికైనా మారాలి. ఎన్‌ఐఏ మార్గాన్ని అనుసరించాలి. స్థానికుల సహకారం, ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ బలోపేతం చేయాలి. అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, పునరావాసం కల్పించాలి.

గుల్షన్‌ కాలనీ కేసు మాఫియాను అంతం చేయడం పెద్ద సవాల్‌. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తే, సమన్వయం ఉంటే తొలగించడం కష్టమేమీ కాదు. పాలకులే నేరస్తులకు అండగా ఉండడం ప్రమాదకరం. సామాజిక శాంతికి విఘాతం. బెంగాల్‌లో ప్రభుత్వం మారితే కేంద్రం ఈ కాలనీ రూపురేఖలు మార్చే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version