https://oktelugu.com/

తమిళనాడులో డీఎంకేను గెలిపిస్తున్నది బీజేపీనే..!

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇక.. తమిళనాడులో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోతోందో ఇప్పటికే ట్రెండింగ్‌ ద్వారా అర్థమవుతోంది. తమిళనాడులో ద్రవిడ దిగ్గజాలు ఇద్దరూ లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఒక్కడే లీడర్‌గా ప్రజల ముందు నిలబడ్డారు. అయితే.. ఏకపక్షంగా ఆయనకు ప్రజలు మద్దతివ్వడానికి బీజేపీనే కారణంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో బీజేపీపై తీవ్ర […]

Written By: , Updated On : April 5, 2021 / 04:02 PM IST
Follow us on

DMK
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇక.. తమిళనాడులో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోతోందో ఇప్పటికే ట్రెండింగ్‌ ద్వారా అర్థమవుతోంది. తమిళనాడులో ద్రవిడ దిగ్గజాలు ఇద్దరూ లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఒక్కడే లీడర్‌గా ప్రజల ముందు నిలబడ్డారు. అయితే.. ఏకపక్షంగా ఆయనకు ప్రజలు మద్దతివ్వడానికి బీజేపీనే కారణంగా చెప్పుకోవచ్చు.

తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన వారికి కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ పట్టు బట్టి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని.. కొన్ని సీట్ల అయినా సరే తీసుకుని పోటీ చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా ప్రచారంలో కూడా చురుగ్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు మోడీ, అమిత్ షా. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్న డీఎంకే.. మరింత విస్తృతంగా మోడీ, అమిత్ షాలను అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయాలని సెటైర్లు వేసేంత పరిస్థితి వచ్చింది.

అయితే.. పరిస్థితిని అన్నాడీఎంకే నేతలు..బీజేపీకి చెప్పే పరిస్థితి లేదు. అదే సమయంలో మోడీ, షాలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వారు తరచూ ప్రచారం చేశారు. ఫలితంగా సోషల్ మీడియాలో వారు తమిళనాడు వచ్చినప్పుడల్లా.. గో బ్యాక్ మోడీ, అమిత్ షాలు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ పరిస్థితులకు తోడు ఎన్నికలకు మూడు, నాలుగు రోజుల ముందు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీదాడులు చేయించడం కలకలం రేపింది. స్టాలిన్ అల్లుడు అంటూ ప్రచారం చేయించినా.. కుమార్తెను అమిత్ షా టార్గెట్ చేశారన్న అభిప్రాయం తమిళుల్లో ఏర్పడింది.

దీంతో ఢిల్లీ నాయకత్వంపై మరింత ఆగ్రహం తమిళుల్లో ప్రారంభమయింది. చివరికి స్టాలిన్‌కు ఈ ఎన్నికల్లో ఉన్న ప్లస్ పాయింట్లకు తోడు బీజేపీ నేతలు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. ఫలితంగా స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకలాగా మారిపోయిందన్న అభిప్రాయం తమిళనాడులోనే కాదు.. అంతటా వ్యక్తమవుతోంది. ఒకవిధంగా స్టాలిన్‌కు సానుభూతి వర్కవుట్‌ కాబోతోందనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది.