US Storm: అమెరికా మరోసారి తుఫాను ఊభిలో చిక్కుకుంది. వడగళ్లు, మెరుపులతో పాటు వేగంగా గాలులు చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. తుఫాను ధాటికి ఉత్తర అమెరికా నుంచి వెళ్లాల్సిన 1000 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చాలా వరకు ఇళ్లు, వ్యాపాపాలు తీవ్రంగా నష్టం చేకూర్చాయి. ఈ తుఫాను తీవ్రతలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. పలు ప్రాంతాల్లో పర్యటించాల్సిన అధ్యక్షుడు బైడెన్ టూర్ ను రద్దు చేసుకొని కార్యాలయంలో తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని ఫెడరల్ కార్యాయాలు మూసివేయాలని, మధ్యాహ్నం 3 గంటలలోపు ఉద్యోగులు ఇంటికి చేరుకోవాలని అధికారులు సూచించారు. తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో పవర్ కట్ అయింది. దీంతో మిలియన్ల కొద్దీ ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.
అమెరికాలోని నేషనల్ వెదర్ సర్వీస్ గ్రేటర్ డీసీ ప్రాంతంలోని టోర్నడో కేంద్రం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ బీభత్సం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు దాదాపు 10 రాష్ట్రాల్లో సుడిగాలుల్లో చిక్కుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం 29.5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ తుఫానులో చిక్కుకున్నట్లు వెదర్ సర్వీస్ తెలిపింది. సౌత్ కరోలినాలోని అండర్సన్ లో తుఫాను సమయంలో తాతయ్య ఇంటికి వచ్చిన 15 ఏళ్ల బాలుడు కారులో నుంచి దిగుతుండగా అతిపై చెట్టుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అలబామాలోని ప్లోరెన్స్ లో 28 ఏళ్ల వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడని ‘వే’ టీవీ తెలిపింది.
తుఫాను కారణంగా వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం సోమవారం రాత్రి నాటికి 2,600 కంటే ఎక్కువ యూఎస్ విమానాలు రద్దు చేయబడ్డాయని తెలిపింది. అలాగే 7,900 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పేర్కొన్నాయి. హర్ట్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమాన సర్వీసు లో ఎక్కువగా రద్దయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేటివ్ తూర్పు తీరానికి వెళ్లే తుఫానుల చుట్టూ విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.
పలు రాష్ట్రాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దమేరీల్యాండ్ లోని వెస్ట్ మిన్ స్టర్ లో వరుసగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో సోమవారం సాయంత్ర అయ్యేసరికి అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మేరీ ల్యాండ్, డెలావేర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెనస్సీ, వెస్ట్ వర్జినియా ల్లో 1.1 మిలియన్ కంటే ఎక్కువ మంది విద్యుత్ ను కోల్పోయారు. తుఫాను వ్యవస్థ మార్గంలో ఉన్న అన్ని రాష్ట్రాలు విద్యుత్ అంతరాయం ఉంటుందని టేనస్సీలోని యూటిలిటీస్ బోర్డు ట్విట్ చేసింది.
తుఫాను పరిస్థితిని అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తన నాలుగురోజుల పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశ ప్రథమ మహిళ జిల్ బిడెన్, విద్యాకార్యదర్శి మిగ్యుల్ కార్డోనా, హొం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూసివేయాలని ప్రకటించారు. ఈ సందర్భంగా వాతావరణ శాస్త్రవేత్త క్రిస్ స్ట్రాంగ్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. ‘కొంతకాలంగా మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన అలజడి ఈ తుఫానుకు కారణం’ అని ఆయన అన్నారు. గతంలో మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా ఇప్పుడు మరోసారి వడగళ్లు, తీవ్రమైన గాలులతో తీవ్రంగా నష్టపోయింది.