Prabhas Adipurush: ప్రభాస్ ఆరోజు ఆ నిర్ణయం తీసుకొని ఉండకపొయ్యుంటే ‘ఆదిపురుష్’ కి ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చేవి కాదా?

గ్రాఫిక్స్ మొత్తం కార్టూన్ నెట్వర్క్ లో ఉండే కార్టూన్ బొమ్మలు లాగ ఉన్నాయి, నిజంగా ఈ సినిమాకి 500 కోట్లు ఖర్చు చేసారా అంటూ కామెంట్స్ వినిపించాయి.

  • Written By: Vicky
  • Published On:
Prabhas Adipurush: ప్రభాస్ ఆరోజు ఆ నిర్ణయం తీసుకొని ఉండకపొయ్యుంటే ‘ఆదిపురుష్’ కి ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చేవి కాదా?

Prabhas Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకపోయినా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత నుండి అన్నీ బాషలలో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ సినిమా టీజర్ అప్పుడే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.

గ్రాఫిక్స్ మొత్తం కార్టూన్ నెట్వర్క్ లో ఉండే కార్టూన్ బొమ్మలు లాగ ఉన్నాయి, నిజంగా ఈ సినిమాకి 500 కోట్లు ఖర్చు చేసారా అంటూ కామెంట్స్ వినిపించాయి. వచ్చిన ఆ నెగటివ్ కామెంట్స్ ని గమనించిన ప్రభాస్, ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాని జూన్ 16 వ తేదికి వాయిదా వేయించి, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయించాడు.

అయితే అప్పటికే బాగా నిరాశ చెందిన ఫ్యాన్స్ ని సంతృప్తి పర్చడం కోసం ప్రభాస్ ముందుగా ఈ టీజర్ ని 3D టెక్నాలజీ కి మార్చి థియేటర్స్ లో విడుదల చెయ్యమన్నారు. 3D టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుండి మూవీ టీం ఈ చిత్రాన్ని కేవలం 2D లో మాత్రమే కాదు, 3D లోకి కూడా కన్వెర్ట్ చేసి విడుదల చేసింది. ఈ సినిమాకి నేడు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం 3D ఎఫెక్ట్ అనే చెప్పాలి.

జనాలు 3D అనుభూతిని పొందేందుకు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడడానికి ఎగబడ్డారు. ఆ కారణం చేతనే ఈ సినిమా ఇంత స్థాయి ఓపెనింగ్ వచ్చింది. ఇదంతా ప్రభాస్ తీసుకున్న నిర్ణయం వల్లే జరిగిందని, ఒకవేళ 3D కాకుండా కేవలం 2D లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వసూళ్ళలో 50 శాతం వసూళ్లు కూడా ఉండేవి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు