Ganesh Immersion Celebration: ఘనంగా మహేష్ బాబు ఇంటే గణేష్ నిమజ్జనం.. ఫొటోలు వైరల్

ఇక ఈ నిమర్జనం వేడుకలలో సితార, గౌతమ్ మాత్రమే కాదు పని వాళ్లు కూడా సంతోషంగా పాల్గొన్నారట. ఈ వీడియోను నమ్రత పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

  • Written By: Suresh
  • Published On:
Ganesh Immersion Celebration: ఘనంగా మహేష్ బాబు ఇంటే గణేష్ నిమజ్జనం.. ఫొటోలు వైరల్

Ganesh Immersion Celebration: తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు ఈ పండుగను ఎంతో సంతోషంగా ఇంటిల్లి పాది కలిపి చేసుకుంటున్నారు. ఇక మన టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఎక్కడ తగ్గకుండా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంట్లో వినాయకున్ని ప్రతిష్టించి మూడు రోజులు, ఐదు రోజులు అంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అంతే కాదు అందుకు సంబంధించిన అప్డేట్ లను కూడా పంచుకుంటున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట కూడా వినాయక వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.

ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు మహేష్ బాబు. ఈ స్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నమ్రత సితార ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యాయి. వీరి ఇంట్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేశారు. ఇక ఈ వేడుకలో మిల్క్ స్టార్ పిల్లలు సితార, గౌతమ్ సందడి చేశారు. అయితే మహేష్ బాబు ఇంట ఐదురోజు వినాయక పూజలు జరగ్గా.. నిమజ్జన వేడుకలను కూడా అంతే సందడిగా నిర్వహించారు.

ఇక ఈ నిమర్జనం వేడుకలలో సితార, గౌతమ్ మాత్రమే కాదు పని వాళ్లు కూడా సంతోషంగా పాల్గొన్నారట. ఈ వీడియోను నమ్రత పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో గౌతమ్ వినాయకున్ని తీసుకొని వస్తుంటే.. సితార ఇంట్లో ఉండే వాళ్లందరూ వెనకాల వస్తున్నారు. కానీ ఇద్దరి మొహంలో ఆ చిరునవ్వు మాత్రం అలాగే ఉంది.

అయితే ఇంటి ముందే ఉన్న ఒక వాటర్ డ్రమ్ లో గణేష్ ను నిమజ్జనం చేశారు. అయితే వీడియోను పోస్ట్ చేస్తూ నమ్రత గణపతి బప్పా మోరియా అంటూ ట్వీట్ చేసింది. అంతా బాగుంది కానీ ఈ వీడియోలో ఎక్కడ కూడా మహేష్ బాబు కనిపించలేదు. అయినా మహేష్ ఇంట్లో ఉండి బయటకు రాలేదా. లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్లారా? అయినా నిమజ్జనం వేళ ఇంట్లో ఉంటే బాగుండూ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత చాలా ఏళ్లకు వీరి కాంబోలో గుంటూరు కారం సెట్ అయ్యింది. మహేష్ బాబుతో రెగ్యులర్ యాక్షన్ మూవీ కాకుండా.. మాస్ టచ్ తో ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో మహేష్ క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. చాలా రోజుల తర్వాత మహేష్ సాఫ్ట్ గా కాకుండా కాస్త రఫ్ గా కనిపించేసరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఎందుకంటే.. శ్రీమంతుడు నుండి సర్కారు వారి పాట వరకు మహేష్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్స్ చేశాడు. అందుకే ఇప్పుడు గుంటూరు కారం టైటిల్ కి తగ్గట్టుగా మాస్ పల్స్ తో ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చేశారు. సో.. ఫ్యాన్స్ అంతా 2024 సంక్రాంతి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు