TANA : తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా పెనమలూరులోనూ మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి తమ ఉదారత చాటుకున్నారు.
పెనమలూరు మండలం గోసాల గ్రామానికి చెందిన పోతురాజు రమేష్ ఇటీవల మరణించడంతో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు, ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకటరమణ గారు, తానా ఫౌండేషన్ ట్రస్టీ చేయూత కోఆర్డినేటర్ శశికాంత్ వల్లేపల్లి గారి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మీడియా సమన్వయకర్త మల్లినేని ఠాగూర్ ఆర్ధిక సౌజన్యంతో పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బోడె ప్రసాద్ గారి చేతుల మీదుగా 50 వేల రూపాయిల చెక్కును గోసాల గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.