Chiranjeevi-Krishna Vamsi: చిరంజీవి కృష్ణవంశీ కాంబో లో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..?

కృష్ణవంశీ సినిమాల్లో ఒకసారి నటిస్తే మంచి యాక్టర్ అని గుర్తింపు సంపాదించుకోవచ్చు అనే మాట అప్పట్లో ఇండస్ట్రీ లో చాలా బాగా వినబడేది. అలా ఒక ఆర్టిస్ట్ లో ఉన్న నటుడిని బయటికి తీసి...

Written By: Gopi, Updated On : October 2, 2023 6:34 pm
Follow us on

Chiranjeevi-Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్ల లో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఒక సినిమాని నార్మల్ డైరెక్టర్లు తీసే సినిమాల కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని పొందుపరిచి సినిమాలు తీయడంలో ఈయన దిట్టా అనే చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చాలా సినిమాలు తీసి ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడంతో పాటు ఆయన సినిమాల్లో నటించిన హీరోలకి కూడా మంచి గుర్తింపు వస్తుంది.

కృష్ణవంశీ సినిమాల్లో ఒకసారి నటిస్తే మంచి యాక్టర్ అని గుర్తింపు సంపాదించుకోవచ్చు అనే మాట అప్పట్లో ఇండస్ట్రీ లో చాలా బాగా వినబడేది. అలా ఒక ఆర్టిస్ట్ లో ఉన్న నటుడిని బయటికి తీసి అంతకుముందు ఆ నటులు చేసిన సినిమాలకి ఈ సినిమాకి నటన పరంగా వాళ్లు చాలావరకు బెస్ట్ అనేలా చేస్తాడు అలానే వాళ్లని బెస్ట్ యాక్టర్లు గా నిలిపే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అయితే కృష్ణవంశీ ఇప్పటివరకు నాగార్జున,చక్రవర్తి, జగపతిబాబు, ఎన్టీఆర్,శ్రీకాంత్ మహేష్ బాబు,రవితేజ, నాని,రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఆయన జీవితం లో ఒక్కసారైనా చిరంజీవి తో సినిమా చేయాలనుకొని ఆయన చాలా సంవత్సరాల పాటు చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నారు…

అయితే ఒకప్పుడు వందేమాతరం అనే ఒక సినిమా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సి ఉంది. ఆ స్టోరీని కృష్ణవంశీ చిరంజీవికి కూడా చెప్పాడు ఆయనకి కూడా నచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం కూడా జరిగింది. అయిన కూడా ఆ సినిమా సెట్స్ మీదికి మాత్రం రాలేదు కారణం అప్పుడు చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు దానివల్ల ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక అప్పుడు ఆ ప్రాజెక్ట్ ని డిలే చేశారు దాని తర్వాత ఈ సినిమా చేద్దాం అని అనుకున్న కూడా కొన్నిసార్లు కృష్ణవంశీ బిజీ గా ఉన్నాడు ఇక దాంతో అలా ఆ ప్రాజెక్ట్ చేయడం కుదరలేదు. అయితే కొద్దిరోజులకే ఇద్దరు ఫ్రీ ఉన్నప్పటికీ కృష్ణవంశీ వరుస ఫ్లాపులతో ఉండటం వల్ల చిరంజీవి కి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆయన తో సినిమా చేయలేదు. కృష్ణవంశీ అలా చిరంజీవితో చేయాల్సిన వందేమాతరం ప్రాజెక్టు చేయలేకపోయాడు.ఇప్పటికీ కృష్ణవంశీ జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఆ సినిమా చేయకపోవడమే అని ఆయన ఇప్పటికీ చెప్తూ ఉంటాడు.

చిరంజీవి కృష్ణవంశీ తో సినిమా చేయలేదు అనే ఒక కారణంతో అప్పట్లో రామ్ చరణ్ చేసిన సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతున్నాయి కానీ నటుడిగా ఆయనకు మంచి పేరు రావట్లేదు అనే కారణం తో కృష్ణవంశీ సినిమాలో చేస్తే రామ్ చరణ్ కు నటుడిగా మంచి గుర్తింపు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశ్యంతో కృష్ణవంశీ ప్లాప్ ల్లో ఉన్నా కూడా చిరంజీవి కృష్ణవంశీ కి పిలిచి మరీ రాంచరణ్ తో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కృష్ణవంశీ ఈ సినిమా చాలా బాగా తీసినప్పటికీ అది అవరేజ్ గానే ఆడింది.ఇక కృష్ణవంశీ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ లేనట్టే…ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కృష్ణవంశీ ప్రస్తుతం ఫేడ్ అవుట్ లో ఉన్నాడు. కాబట్టి చిరంజీవి కృష్ణవంశీ తో సినిమా చేయడం అసాధ్యం అనే చెప్పాలి…