Vijayendra Prasad: జూనియర్ ఎన్టీయార్ ని తక్కువ చేసి మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్…

రాజమౌళి ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నాలుగు సినిమాలను చేశాడు. ఇక తనకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగిన కూడా రాజమౌళి ఎన్టీఆర్ అనే చెప్తాడు.అలాగే ఎన్టీయార్ కి రాజమౌళి ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది.

Written By: Gopi, Updated On : January 27, 2024 10:55 am
Follow us on

Vijayendra Prasad: తెలుగు లో సింహాద్రి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి. ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి తన ఫస్ట్ సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ని ఎన్టీయార్ తో చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో ఎన్టీయార్ రాజమౌళి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.

అందుకే రాజమౌళి ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నాలుగు సినిమాలను చేశాడు. ఇక తనకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగిన కూడా రాజమౌళి ఎన్టీఆర్ అనే చెప్తాడు.అలాగే ఎన్టీయార్ కి రాజమౌళి ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇక ఎన్టీయార్ తో ఇంతమంచి సాన్నిహిత్యం ఉన్న రాజమౌళి అండ్ వాళ్ల ఫ్యామిలీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్టీఆర్ ని తక్కువ చేసి మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమాకి రాఘవేంద్ర రావు గారు ఒక మంచి హీరోని ఇస్తారు అనుకుంటే బండగా ఉన్న ఎన్టీఆర్ ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ మీద సెటైర్లు వేశాడు. అలాగే రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తీసిన సినిమాల్లో ఆమెకి నచ్చని సినిమా ఎది అని అడిగితే ఎన్టీయార్ హీరో గా చేసిన యమదొంగ సినిమా తనకి నచ్చదని చెప్పింది.

అలాగే రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ది సపోర్టింగ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ రామ్ చరణ్ చేశాడు అంటూ మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్టీఆర్ అంటే వీళ్ళందరికి ఇష్టమని చెప్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ గురించి ఎందుకిలా ప్రతిసారీ తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి ఫ్యామిలీ మీద చాలా ఫైర్ అవుతున్నారు.

మొత్తానికైతే ఏదో ఒక రకంగా ఎన్టీయార్ ని డామినేట్ చేయాలనే ఉద్దేశ్యం తోనే వీళ్లు మాట్లాడుతూ ఉండటం ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తూందంటు ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయేంద్రప్రసాద్ ఎన్టీయార్ మీద చేసిన కామెంట్లు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు…