Vijay Devarakonda: ఆ ముగ్గురు లేకపోతే తన జీవితం ఇలా ఉండేది కాదంటూ ఎమోషనల్ అయినా విజయ్ దేవరకొండ

కీడా కోలా సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశారు. అంతే కాదు తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా చేశారు.

Written By: Neelambaram, Updated On : October 30, 2023 4:50 pm
Follow us on

Vijay Devarakonda: దర్శకుడు తరుణ్ భాస్కర్ త్వరలోనే కీడా కోలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పెళ్లి చూపులు సినిమాతో మంచి ఫేమ్ ను సంపాదించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతుండడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3వ తేదీన విడుదలకు సిద్దమైంది. దీంతో భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశారు. అంతే కాదు తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా చేశారు.

విజయ్ దేవరకొండ నటించిన మొదటి సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తనను హీరోగా పరిచయం చేసింది డైరెక్టర్ తరుణ్ అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి జీవితాన్ని పెరిగిన వాతావరణం, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు మాత్రమే ప్రభావితం చేస్తాయన్నారు. వీటి వల్లే నేను మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటూ మాట్లాడారు విజయ్. తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ అని తెలిపారు. అంతే కాదు ఈ ముగ్గురు తన జీవితాన్ని మార్చేశారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల క్రితం వరకు తనకు ఈ ముగ్గురు ఎవరో కూడా తెలియదని.. ఒక్కొక్కరం ఒక్కో చోట పెరిగాం. ఒక్కో చోట చదువుకున్నాం. కానీ అందరిని సినిమా కలిపిందని గుర్తు చేశారు. అయితే పెళ్లి చూపులు సినిమా తెరకెక్కించినందుకు తరుణ్ భాస్కర్ కు నేషనల్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు రౌడీ భాయ్. ఈ సినిమా హిట్ తర్వాత తరుణ్ కు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా వారితో చేయకుండా తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేశారని గుర్తు చేశారు. అంతే కాదు సినిమాను వినోదంగా మాత్రమే చూశారని.. వ్యాపారంగా చూడలేదని కొనియాడారు. ఇలా విజయ్ తరుణ్ భాస్కర్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.