డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినీ రంగం మెల్లమెల్లగా తిరిగి పూర్వ వైభవం సంతరించుకుని వరుసపెట్టి సినిమాలు విడుదలకి సిద్దమవటంతో అటు మూవీ ఇండస్ట్రీలోనూ, ఇటు సినీ అభిమానులలోనూ ఉత్సాహం నెలకొంది. తెలుగు సినిమా పరిశ్రమ మంచి మంచి సినిమాలు అందిస్తూ దేశం అంతటా మనవైపు చూసే విధంగా ఉండటానికి మారిన హీరో, దర్శక, నిర్మాతల అభిరుచి కారణం అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో హీరోలందరూ సూపర్ ఫామ్ లో కొనసాగుతుండగా, వారి నుండి వస్తున్న న్యూ […]

Written By: admin, Updated On : February 3, 2021 2:31 pm
Follow us on


కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినీ రంగం మెల్లమెల్లగా తిరిగి పూర్వ వైభవం సంతరించుకుని వరుసపెట్టి సినిమాలు విడుదలకి సిద్దమవటంతో అటు మూవీ ఇండస్ట్రీలోనూ, ఇటు సినీ అభిమానులలోనూ ఉత్సాహం నెలకొంది. తెలుగు సినిమా పరిశ్రమ మంచి మంచి సినిమాలు అందిస్తూ దేశం అంతటా మనవైపు చూసే విధంగా ఉండటానికి మారిన హీరో, దర్శక, నిర్మాతల అభిరుచి కారణం అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో హీరోలందరూ సూపర్ ఫామ్ లో కొనసాగుతుండగా, వారి నుండి వస్తున్న న్యూ మూవీస్ విడుదలకు ముందే మంచి ధరలకు అమ్ముడవుతూ నిర్మాతలని సేఫ్ చేస్తున్నాయి.

Also Read: మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం !

ఒక్కో హీరో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే వారి రికార్డ్స్ ని వాళ్ళే బద్దలుకొడుతూ అందరికి షాక్ ఇస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ డిజిటల్ & శాటిలైట్ రైట్స్ కలిపి 32-35 కోట్ల మధ్యలో అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇది మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక రేట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. వంశి పైడిపల్లి, మహేష్ కాంబినేషన్లో వచ్చిన మహర్షి మూవీ రైట్స్ రూపంలో 27.5 కోట్లు సంపాదించి రికార్డు నమోదు చేయగా ఇప్పుడు SVP మూవీ దాన్ని మించి చేసింది.

Also Read: మహేష్ స్టేషన్స్ చుట్టూ తిరగలేక అలిసిపోయాడట !

ఇక ఇప్పటివరకు తెలుగు మూవీ ఇండస్ట్రీలో వినయ విధేయ రామ 25 కోట్లు, F-2 25 కోట్లు, సరిలేరు నీకెవ్వరూ 24 కోట్లు, అరవింద సమేత వీర రాఘవ 23 కోట్లు, ఆలా వైకుంఠ పురములో 21 కోట్లు ధరలకు డిజిటల్ & శాటిలైట్ రైట్స్ మార్కెట్ చేసి SVP, మహర్షి మూవీ తర్వాత వరుసలో ఉన్నాయి. మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న సర్కారు వారి పాట మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్