Prabhas: మరోసారి ప్రభాస్ ను తక్కువ అంచనా వేసిన బాలీవుడ్…దిమ్మతిరిగి పోయే దెబ్బ కొట్టిన రెబల్ స్టార్…

టే బాలీవుడ్ దర్శకుడైన ఓం రావత్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన ఆది పురుషు సినిమా ఫ్లాప్ అవడంతో ఇక బాలీవుడ్ లో ప్రభాస్ హవా అయిపోయింది. తన సినిమాలు బాలీవుడ్ లో అంత సక్సెస్ సాధించలేవు అంటూ బాలీవుడ్ మాఫియా ప్రభాస్ ని కొంత చులకన గా చూశారు.

Written By: Gopi, Updated On : February 3, 2024 2:11 pm
Follow us on

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటిసారి పాన్ ఇండియా హీరో గా ఎదిగి బాలీవుడ్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఒకే ఒక హీరో ప్రభాస్… ఈయన నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనకి బాలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ పెరగడం వల్ల అక్కడున్న హీరోలకి క్రేజ్ తగ్గిపోతుందని వాళ్లు కొంత ఇన్ఫినియారిటీ కాంప్లెక్స్ లో పడ్డట్టుగా తెలుస్తుంది. మన హీరోల వల్ల వాళ్ళు అవకాశాలను కోల్పోతారేమో అనే ఉద్దేశ్యం లో సౌత్ సినిమాలను నియంత్రించాలని చూశారు. అయినప్పటికీ బాహుబలి 2 పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ కావడంతో ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఆపే కెపాసిటీ వాళ్ళకి లేకుండా పోయింది.

ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకుడైన ఓం రావత్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన ఆది పురుషు సినిమా ఫ్లాప్ అవడంతో ఇక బాలీవుడ్ లో ప్రభాస్ హవా అయిపోయింది. తన సినిమాలు బాలీవుడ్ లో అంత సక్సెస్ సాధించలేవు అంటూ బాలీవుడ్ మాఫియా ప్రభాస్ ని కొంత చులకన గా చూశారు. కానీ ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ బాద్షా ఆయన షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన డంకి సినిమాకి పోటీగా సలార్ సినిమాను దింపి 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి మరోసారి బాలీవుడ్ లో తన జెండాను ఎగరేశాడు. ప్రభాస్ ని తక్కువ అంచనా వేస్తే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మరొకసారి బాలీవుడ్ మాఫియా కి రుచి చూపించాడు.

ఇక ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ తార స్థాయిలో ఉందనే చెప్పాలి. ఇక ప్రభాస్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే సౌత్ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ల సత్తా ను చాటుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, కల్కి అనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అందులో భాగంగానే సందీప్ వంగ దర్శకత్వంలో చేయబోయే స్పిరిట్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది…