Homeఎంటర్టైన్మెంట్Peddi producer arrest: కొత్త సమస్యల్లో చిక్కుకున్న 'పెద్ది'.. నిర్మాత అరెస్ట్ కాబోతున్నాడా? అసలు ఏమి...

Peddi producer arrest: కొత్త సమస్యల్లో చిక్కుకున్న ‘పెద్ది’.. నిర్మాత అరెస్ట్ కాబోతున్నాడా? అసలు ఏమి జరుగుతోంది..

Peddi producer arrest: హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ కారణంగా ఇప్పటికే పెద్ది చిత్రం అనేక వివాదాలను ఎదురుకుంటోంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే ఇప్పుడు చర్చ. డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఈ అంశంపై స్పందిస్తూ , తక్షణమే ఆ సన్నివేశలను తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే నిన్న జరిగిన థాంక్యూ మీట్ లో జరుగుతున్న ఈ వివాదం పై బుచ్చి బాబు నోరు మెదపకపోవడం గమనార్హం. ఉన్న ఈ ఒక్క వివాదం చాలదు అన్నట్టు , మరో వివాదం ఈ సినిమా మెడకు చుట్టుకుంది. ఈ చిత్రం లో విజయనగరం జిల్లాలోని ఆదివాసీయులను కించపరిచారని ఆదివాసీ సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. 3 గంటల సినిమాలో , దాదాపుగా 15 సందర్భాల్లో మమ్మల్ని దారుణంగా అవమానించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఇంత దారుణంగా మమ్మల్ని అవమానించినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు చూసి చూడనట్టు వ్యవహరించి , ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం అత్యంత దారుణమైన విషయమని చెప్పుకొచ్చారు. తమ పూర్వికులు రామాయణం , మహాభారతం వంటి ఘట్టాల్లో భాగం అయ్యారని , అలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మూవీ టీం స్పందిస్తుందో లేదో చూడాలి. అయితే ఏ సందర్భాల్లో ఆదివాసీయులను అవమానించారో చెప్పాలంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక కొండ ప్రాంతం నుండి వచ్చిన ఆదివాసీయుడు , తన అద్భుతమైన టాలెంట్ తో ఒలంపిక్స్ లో గేమ్స్ ఆడి ఇండియా కి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు , ఇది ఎంతో ఆదర్శవంతమైన విషయం , ఆదివాసీయుల గొప్పదనం , సత్తా ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడం. మెచ్చుకోవాల్సింది పోయి , కేసులు పెడుతారా అంటూ అభిమానులు మండిపడుతున్నారు , మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో శివ రాజ్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తో పాటు, కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసి , రామ్ చరణ్ – జగపతి బాబు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను జత చేయనున్నారని , త్వరలోనే ఈ కొత్త వెర్షన్ కి సెన్సార్ చేయించి థియేటర్స్ లో వదులుతారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇకపోతే ఈ చిత్రం 5 రోజుల్లో 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది, ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular