Peddi producer arrest: హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ కారణంగా ఇప్పటికే పెద్ది చిత్రం అనేక వివాదాలను ఎదురుకుంటోంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే ఇప్పుడు చర్చ. డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఈ అంశంపై స్పందిస్తూ , తక్షణమే ఆ సన్నివేశలను తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే నిన్న జరిగిన థాంక్యూ మీట్ లో జరుగుతున్న ఈ వివాదం పై బుచ్చి బాబు నోరు మెదపకపోవడం గమనార్హం. ఉన్న ఈ ఒక్క వివాదం చాలదు అన్నట్టు , మరో వివాదం ఈ సినిమా మెడకు చుట్టుకుంది. ఈ చిత్రం లో విజయనగరం జిల్లాలోని ఆదివాసీయులను కించపరిచారని ఆదివాసీ సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. 3 గంటల సినిమాలో , దాదాపుగా 15 సందర్భాల్లో మమ్మల్ని దారుణంగా అవమానించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.
ఇంత దారుణంగా మమ్మల్ని అవమానించినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు చూసి చూడనట్టు వ్యవహరించి , ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం అత్యంత దారుణమైన విషయమని చెప్పుకొచ్చారు. తమ పూర్వికులు రామాయణం , మహాభారతం వంటి ఘట్టాల్లో భాగం అయ్యారని , అలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మూవీ టీం స్పందిస్తుందో లేదో చూడాలి. అయితే ఏ సందర్భాల్లో ఆదివాసీయులను అవమానించారో చెప్పాలంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక కొండ ప్రాంతం నుండి వచ్చిన ఆదివాసీయుడు , తన అద్భుతమైన టాలెంట్ తో ఒలంపిక్స్ లో గేమ్స్ ఆడి ఇండియా కి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు , ఇది ఎంతో ఆదర్శవంతమైన విషయం , ఆదివాసీయుల గొప్పదనం , సత్తా ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడం. మెచ్చుకోవాల్సింది పోయి , కేసులు పెడుతారా అంటూ అభిమానులు మండిపడుతున్నారు , మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో శివ రాజ్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తో పాటు, కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసి , రామ్ చరణ్ – జగపతి బాబు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను జత చేయనున్నారని , త్వరలోనే ఈ కొత్త వెర్షన్ కి సెన్సార్ చేయించి థియేటర్స్ లో వదులుతారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇకపోతే ఈ చిత్రం 5 రోజుల్లో 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది, ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
