Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేశ్‌- త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ... మిస్ ఇండియా భామ

Mahesh Babu: మహేశ్‌- త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా … మిస్ ఇండియా భామ

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మ‌హేశ్, దర్శకుడు ప‌ర‌శురాంతో చేస్తున్న ” స‌ర్కారు వారి పాట ” షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్‌ లతో సినిమాలకు కమిట్ అయ్యారు మహేశ్. అయితే త్రివిక్రమ్ తో ఆయన చేయబితున్న మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేశ్‌ సరసన అప్‌కమింగ్‌ మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

miss india meenakshi chowdary confirmed as second heroin in mahesh and trivikram movie

ఇటీవల విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో కూడా నటించే చాన్స్‌ కొట్టెసింది మీనాక్షి. ఈ క్రమంలోనే ఆమె త్రివిక్రమ్ – మహేశ్‌ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా షూట్ లో బిజీగా ఉన్న మహేశ్… ఈ మూవీ పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular