Swasika: తోటి నటుడిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..

మలయాళం పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. యాంకర్ సుమ నుంచి హీరోయిన్ల వరకు ఎంతో మంది ఇక్కడి ఇండస్ట్రీలో ప్రముఖులుగా కొనసాగుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : January 17, 2024 2:33 pm

Swasika

Follow us on

Swasika: సినిమా పరిశ్రమలో కలిసి నటించిన వాళ్లు .. ఆ తరువాత పెళ్లి చేసుకునే సాంప్రదాయం నాటి నుంచే వస్తుంది. తాజాగా ఓ నటి తోటి నటుడితో కలిసి కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్ల పాటు వీరిపై ఎన్నో వార్తలు వచ్చినా.. తాజాగా వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యాంకర్ గా, సైడ్ యాక్టర్, హీరోయిన్ గా నటించిన ఈమె తెలుగులో ఏ సినిమాలో నటించిందో తెలుసా?

మలయాళం పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. యాంకర్ సుమ నుంచి హీరోయిన్ల వరకు ఎంతో మంది ఇక్కడి ఇండస్ట్రీలో ప్రముఖులుగా కొనసాగుతున్నారు. వారిబాటలోనే స్వసిక కూడా సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో ‘వాగై’ అనే సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత ‘గొరిపాళయం’ అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది.

తెలుగులోనూ స్వసిక ఓ సినిమాలో నటించింది. 2012లో ‘ఎటు చూసినా నువ్వే’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి సొంత ఇండస్ట్రీలో నటించింది. అయితే సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ స్వసిక తన నటనా పర్ఫామెన్స్ ను చూపించింది. 2020లో ‘మనం పోల్ మాంగల్యం’ అనే సీరియల్ లో విజయ్ తో కలిసి నటించింది. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు.

హీరోయిన్, టీవీ సీరియల్ లో నటించడమే కాకుండా పలు టీవీ షో ల్లో హోస్ట్ గా మెరిసింది. అయితే విజయ్ తో ప్రేమలో పడ్డాగా వీరి గురించి అనేక కథనాలు వచ్చాయి. వీటిపై ఎలాంటి రియాక్ట్ కాని స్వసిక తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోయే విషయాన్ని వెల్లడించారు. దీంతో సినీ ఇండస్ట్రీలో మరో సెలబ్రెటి కపుల్స్ ఒక్కటి కాబోతున్నమారన్నమాట.