Homeఎంటర్టైన్మెంట్Daggubati Family : విక్టరీ వెంకటేష్ కుటుంబంలో తీవ్ర విషాదం... ఆయన ఇక లేరు!

Daggubati Family : విక్టరీ వెంకటేష్ కుటుంబంలో తీవ్ర విషాదం… ఆయన ఇక లేరు!

Daggubati Family : హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా మోహన్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 4 మంగళవారం ఆయన మరణించారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మూవీ మొఘల్ గా దశాబ్దాల ప్రస్థానం సాగించిన లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడుకి మోహన్ బాబు తమ్ముడు అవుతారు. వీరి స్వగ్రామం కారంచేడు.

దగ్గుబాటి మోహన్ బాబు మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కారంచేడు చేరుకున్నారు. సురేష్ బాబు, అభిరామ్ నిన్ననే కారంచేడు వచ్చినట్లు సమాచారం. ముంబైలో షూటింగ్ చేస్తున్న వెంకటేష్ మాత్రం ఇంకా రాలేదట. ఆయన వచ్చాక అంత్యక్రియలు కారంచేడులో నిర్వహించనున్నారట. మోహన్ బాబు చిత్ర పరిశ్రమకు రాలేదు.

చీరాలలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఓ థియేటర్ ఉంది. దాని నిర్వహణ మోహన్ బాబు చూసుకునేవారని సమాచారం. మోహన్ బాబు మరణంతో వెంకటేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మోహన్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. హిట్, హిట్ 2 చిత్రాలలో ప్రేక్షకులను అలరించిన శైలేష్ కొలను సైంధవ్ చిత్ర దర్శకుడిగా ఉన్నాడు. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా సైంధవ్ విడుదల కానుంది. వెంకటేష్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ నటిస్తున్నట్లు సమాచారం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version