కడుపు మీద కొట్టకండి అని వేడుకుంటున్న బండ్ల గణేష్..?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, కమెడియన్, రాజకీయ నేత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా సంచలన పోస్టులు పెట్టారు. కరోనా సోకడానికి ముందు అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్ కరోనా సోకిన తరువాత చాలా మారాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం తన వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే తనను క్షమించాలని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు. Also Read: కరోనా టైంలో ‘క్రాక్’ చూపిస్తున్న మాస్ […]

Written By: Navya, Updated On : October 12, 2020 3:30 pm
Follow us on

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, కమెడియన్, రాజకీయ నేత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా సంచలన పోస్టులు పెట్టారు. కరోనా సోకడానికి ముందు అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్ కరోనా సోకిన తరువాత చాలా మారాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం తన వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే తనను క్షమించాలని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు.

Also Read: కరోనా టైంలో ‘క్రాక్’ చూపిస్తున్న మాస్ మహారాజ్..!

ట్విట్టర్ వేదికగా వివాదాస్పదమైన పోస్టులు, కామెంట్లు చేయకుండా బండ్ల గణేష్ వ్యవహరిస్తున్నారు. పవన్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ కొన్ని రోజుల క్రితం పవన్ తో మరో సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటన చేశారు. అయితే బండ్ల గణేష్ అలా చెప్పిన తరువాత ఆయన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం పవన్ ఓకే చెప్పిన ప్రాజెక్టులే పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.

దీంతో బండ్ల గణేష్ పవన్ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి కొందరు మాత్రం పవన్ బండ్ల గణేష్ కు సినిమా చేస్తానని హామీ ఇచ్చి ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బండ్ల గణేష్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బండ్ల చేసిన ట్వీట్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Also Read: మహేష్ వర్సెస్ ఎన్టీఆర్.. ముందుగా వచ్చేదెవరు?

బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో ” వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి ……ఇది నా విన్నపం. నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన” అని ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ అకస్మాత్తుగా ఈ విధంగా ట్వీట్ చేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/ganeshbandla/status/1315155106648612866