Balayya: అందరి కళ్లు బాలయ్య చేతిపైనే.. అసలు ఆయనకు ఏమైంది?

Balayya: ఏపీ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీని అవమానిస్తూ వైసీపీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కన్నీరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ.. నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. అయితే, ఈ సమావేశంలో అందరి కళ్లు బాలయ్య ఎడమచేతి మీదే ఉన్నాయి. ఆయన చేతికి కట్టుకుని మీడియా ముందు కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో, అసలు బాలయ్యకు ఏమైందంటూ… ఆయన అభిమానులు ఆందోళన […]

Written By: Raghava Rao Gara, Updated On : November 21, 2021 10:17 am
Follow us on

Balayya: ఏపీ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీని అవమానిస్తూ వైసీపీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కన్నీరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ.. నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. అయితే, ఈ సమావేశంలో అందరి కళ్లు బాలయ్య ఎడమచేతి మీదే ఉన్నాయి. ఆయన చేతికి కట్టుకుని మీడియా ముందు కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దీంతో, అసలు బాలయ్యకు ఏమైందంటూ… ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. గత ఆరునెలలుగా బాలయ్య భుజన నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 31న బంజారాహిల్స్​లోని కేర్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన బాలయ్య.. సర్జరీ తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావడం జరిగింది.

కాగా, ప్రస్తుతం బాలయ్య ఆహా వేదికగా అన్​స్టాపబుల్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ షోలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా మూడు షోలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. తర్వాత ఎపిసోడ్​ త్వరలోనే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్​. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు, బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ ఊరమాస్​లో ఉంది. మిలియన్ల వ్యూస్​తో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.