Ananya Nagalla: వివాదాస్పద వేణు స్వామితో పవన్ కళ్యాణ్ హీరోయిన్… అందుకే అంటూ సోషల్ మీడియాలో రచ్చ షురూ!

వేణు స్వామి తన ఇంటికి వచ్చిన సెలబ్రెటీలు, సినీ తారలతో బగళాముఖీ దేవి, రాజ శ్యామలా దేవి, తార, చిన్నమస్త వంటి పూజలు చేయిస్తాడు. ఈ పూజల్లో మద్యం, మాంసం వాడతానని ఆయన ఓపెన్ గానే చెప్పిన వీడియోలు ఉన్నాయి.

Written By: S Reddy, Updated On : March 14, 2024 6:29 pm

Ananya Nagalla

Follow us on

Ananya Nagalla: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమా హీరోలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ సెలెబ్రెటీ జ్యోతిష్యుడు అయ్యాడు. పైగా గతంలో వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాలు నిజం అవడంతో చాలా మంది అతన్ని నమ్ముతున్నారు. సినీ తారల్లో పలువురు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇండస్ట్రీలో వేణు స్వామికి మంచి డిమాండ్ ఉంది.

వేణు స్వామి తన ఇంటికి వచ్చిన సెలబ్రెటీలు, సినీ తారలతో బగళాముఖీ దేవి, రాజ శ్యామలా దేవి, తార, చిన్నమస్త వంటి పూజలు చేయిస్తాడు. ఈ పూజల్లో మద్యం, మాంసం వాడతానని ఆయన ఓపెన్ గానే చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ అతనితో పూజలు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో బ్యూటీ చేరింది. వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ రీసెంట్ గా వేణు స్వామిని కలిసింది. తన కొత్త సినిమా తంత్ర విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా మార్చి 15న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనన్య నాగళ్ళ వేణు స్వామిని కలవడం చర్చనీయాంశంగా మారింది. సినిమా సక్సెస్ అవడం కోసం ఈ బ్యూటీ వేణు స్వామి తో పూజలు చేయించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తంత్ర మూవీ హారర్ జోనర్ లో వస్తుంది. ఇందులో క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాలు లాంటివి ఉన్నాయట.

రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అషు రెడ్డి, ఇనాయ సుల్తానా వంటి హీరోయిన్లు వేణు స్వామి దగ్గర పూజలు చేయించారు. తాజాగా సక్సెస్ దక్కాలని అనన్య నాగళ్ళ వేణు స్వామిని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె వేణు స్వామి తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కేవలం కలిసి ఆశీర్వాదం తీసుకుందా లేక ప్రత్యేక పూజలు కూడా చేయించిందా అనేది తెలియాల్సి ఉంది.