Women Extramarital Affairs: కొద్దిరోజుల క్రితం కేరళ రాష్ట్రంలో ఒక దారుణం జరిగింది. అక్కడ ఒక 35 సంవత్సరాల మహిళ భర్త చనిపోవడంతో.. ఏడాదిన్నర వయసు ఉన్న బాబును వదిలేసి మరొకడితో పారిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి వెళ్లి ఆ బాబును తెచ్చుకుంది. ప్రియుడితో సరసాలు ఆడుతున్నప్పుడు బాబు అడ్డుగా ఉండడంతో.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఏడాదిన్నర బాబు అని కూడా చూడకుండా ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ బాబు కాళ్లు చేతులు విరిగిపోయాయి. దేహం మీద 150 కి పైగా గాయాలు ఉన్నాయి.
ఆమె పేరు ప్రియాంక. ఉండేది కర్ణాటకలో.. 10 సంవత్సరాల బాబు.. ఆరు సంవత్సరాల బాలిక ఈమెకు సంతానం. భర్త టీచర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆమెకు తన చిన్ననాటి స్నేహితుడు పరిచయమయ్యాడు. అతడితో ఆమె వ్యవహారం మొదలుపెట్టింది. భర్తను, కొడుకుని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. వెళ్తు వెళ్తూ పాపను తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ప్రియుడితో సంబంధం కొనసాగించేందుకు కుమార్తె అడ్డుగా ఉండడంతో ఆమెను చంపేసింది. ఆపై పోస్టుమార్టం నివేదికను తప్పుడుగా రూపొందించి భర్తకు పంపించింది. అతడికి అనుమానం రావడంతో విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడికి చూపించాడు. అందులో మొత్తం తప్పులు ఉన్నాయని అతడు చెప్పాడు. దీంతో ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూయి.
ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇంతకంటే దారుణాలు ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి మాతృత్వానికి సిసలైన చిరునామాగా.. ఆప్యాయతకు.. నిలువెత్తు ప్రేమకు ఆడవాళ్లను ఉదాహరణలుగా చెబుతుంటారు. అమ్మ ప్రేమ అత్యంత గొప్పదని వివరిస్తుంటారు. చివరికి నేటి కాలంలో అమ్మ ప్రేమ కూడా మారిపోయింది. తాచు పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా.. నేటి కాలంలో అమలు కూడా తమ పిల్లల్ని తామే చంపుకుంటున్నారు.. అది కూడా చాటుమాటు సంబంధాల కోసం..
ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో మానసిక విశ్లేషకులు ఒక సర్వే నిర్వహించారు. దాని ప్రకారం 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఇటువంటి తాత్కాలిక ప్రేమలకు లొంగిపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొంతమంది కామాంధులు 35 నుంచి 40 దాటిన మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ మహిళలను బాగా పొగుడుతుంటారు. వాళ్ల మీద విపరీతమైన శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. అసలు జీవితంలో ఏనాడు కూడా భర్త ఈ స్థాయిలో చూసుకో లేనంత అనుభూతిని కలిగిస్తారు.. ప్రపంచాన్ని కళ్ళముందు ఉంచుతారు. నీతోనే బతుకు అంటూ చెబుతుంటారు. ఆ మైకంలో ఈ మహిళలు అన్ని విషయాలను ఆ కామాంధులకు చెప్పేస్తుంటారు. ఇంట్లో విషయాలు.. ఆస్తులు.. డబ్బు.. భర్త వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా ఏ విషయాన్ని కూడా దాచుకోరు. ఆ తర్వాత వీడియో కాల్స్ మొదలవుతాయి. అనంతరం అది అర్ధ నగ్నత్వానికి దారితీస్తుంది. అనంతరం పూర్తిస్థాయిలో నగ్నంగా మారి కాల్స్ చేసుకొనే స్థాయికి దిగజారుతారు. ఇక రాత్రి మొత్తం అదే పనిలో ఉంటారు.
మరింత ఏకాంతం కోసం ఏవో కారణాలు చెప్పి ఉన్న ఊర్లు వదిలి వెళ్ళిపోతారు. Oyo రూములలో కలుసుకుంటారు. ఒక బలహీనమైన క్షణంలో పిల్లల్ని.. కట్టుకున్న భర్తని వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోతారు. వెళ్తూ వెళ్తూ డబ్బు.. నగలు తీసుకెళ్తుంటారు. ఒకవేళ ఆ కామాంధుడు కొంతలో కొంత మంచోడు అయితే.. నగలు, డబ్బు తీసుకుంటాడు. లేకపోతే అవన్నీ తీసుకొని ఆమెను వేరే గృహాలకు హామీ ఇస్తుంటాడు. ఇక జన్మలో ఆమె బయట ప్రపంచాన్ని చూడలేదు.
ఇంకా కొందరైతే ఆ వీడియో కాల్స్.. ఆ ఫోటోలు అన్ని చూపించి.. నాకు ఎప్పటికీ సరెండర్ కావాల్సిందేనని బెదిరిస్తుంటారు. లేకపోతే వాటిని ఇంటర్నెట్లో పెట్టి ఇజ్జత్ మొత్తం తీస్తానని బెదిరిస్తారు. సమాజం ముందు పరువు.. పిల్లల ముందు గౌరవం.. తల్లిదండ్రులు, భర్త ముందు భయం ఇవన్నీ తట్టుకోలేక అటువంటి వారి డిమాండ్లను మహిళలు తీర్చేస్తుంటారు. ఫిజికల్ గా బంగారం.. డబ్బు ఇస్తారు. శరీరాన్ని కూడా సమర్పించుకుంటారు.
వాస్తవానికి 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు ఇటువంటి పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పటికే పిల్లలు పెద్ద వాళ్ళు అవుతుంటారు. వాళ్లు స్కూలు లేదా కాలేజీలకు వెళ్తుంటారు. ఈ సమయంలో భర్త తో ఏకాంతాన్ని గడపాలని మహిళలకు ఉంటుంది. కానీ అప్పటికే కుటుంబ బాధ్యతలు మీద పడి ఉండడంతో భర్తలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అప్పటికే సంసారంలో అనేక రకాలుగా గొడవలు వస్తూ ఉంటాయి. అవి మహిళలకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇదే సమయంలో పరాయి పురుషులు రంగ ప్రవేశం చేసి ఆ మహిళల వీక్నెస్ లను పసిగడుతుంటారు. వాటి ఆధారంగా వాళ్లతో మాటలు కలుపుతుంటారు. చివరికి ఇంతటి దారుణాలకు కారణమవుతుంటారు. ఇదంతా జరిగిందని తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి తాత్కాలిక బంధాలకు ఆకర్షితులు కాకుండా.. తమను తాను నిగ్రహించుకోవడమే నేటి కాలంలో మహిళలు చేయాల్సిన పని. ఒకవేళ ఇటువంటి బంధాలకు ఆకర్షితులైతే కుటుంబాలు కూలిపోతాయి. పిల్లలు ఆగమైపోతారు. కొన్ని సందర్భాల్లో జీవితమే లేకుండా పోతుంది. తస్మాత్ జాగ్రత్త.

