Site icon OkTelugu

Chambal dacoit: ఓ బందిపోటు దొంగ ముఖ్యమంత్రి కే దమ్కీ ఇచ్చాడు.. చివరికి ఏమైందంటే..

Chambal dacoit

Chambal dacoit

Chambal dacoit: విక్రమార్కుడు సినిమా చూశారా.. అందులో చంబల్ లోయలో టిట్ల అనే బందిపోటు దొంగ ఉంటాడు. అక్కడ ఒక సమాంతర వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటాడు. దోపిడీలు.. దుర్మార్గాలు చేస్తూ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు. ఇప్పుడంటే అటువంటి వాళ్లకు అవకాశం లేదుగానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అటువంటి దొంగలు ఉత్తర భారత దేశంలో విచ్చలవిడిగా వ్యవహరించేవారు. ప్రజలకు నరకం చూపించేవారు. డబ్బులు.. ఖరీదైన వస్తువులనే కాదు.. ఇంట్లో ఆడవాళ్లను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేవారు.. అటువంటి వారిలో ఇతడు ముందు వరుసలో ఉంటాడు. ఏకంగా ముఖ్యమంత్రి కే భయం అంటే ఏంటో చూపించాడు. చివరికి ఇలా మిగిలిపోయాడు.

అతడి పేరు గుర్జర్.. చంబల్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన దొంగల్లో ఒకడు. ఇతడు దొంగల ముఠాకు నాయకుడిగా ఉండేవాడు. దోల్పూర్ డాంగ్ లోయలో ఎన్నో సంవత్సరాల పాటు తన సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. హత్యలు చేయడం.. దోపిడీలకు పాల్పడటం.. దొంగతనాలు చేయటం.. వసూళ్లకు తెగబడటం.. మనుషులను అపహరించడం.. ఆయుధాలను సమకూర్చుకోవడం వంటి వాటి కింద ఇతడి మీద నేరాలు నమోదయ్యాయి. రాజస్థాన్ నుంచి మొదలుపెడితే మధ్యప్రదేశ్ వరకు ఇతర మీద 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి..

గుర్జర్ రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర ఉండేవారు. నాడు ఆమెకు సంబంధించిన దోల్పూర్ పాలస్ మొత్తాన్ని పేల్చేస్తానని ఇతడు బెదిరించాడు. ఆ స్టేట్మెంట్ ద్వారా అతడు ఒక్కసారిగా జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచాడు. చాలా సంవత్సరాల పాటు పరారీలో ఉన్నాడు. 8 సంవత్సరాల క్రితం భయాన ప్రాంతంలో అప్పటి ఎస్పీ భరత్ పూర్ మాలిని ఎదుట లొంగిపోయాడు.

ఆ తర్వాతనే రాజస్థాన్ లోని అత్యంత కఠినమైన భద్రత ఉండే అజ్మీర్ జైల్లో వేశారు. శిక్ష అనుభవిస్తున్న అతడు ఉన్నట్టుండి చనిపోయాడు. అయితే ఇది హత్య అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడు బ్యారక్ లోనే చనిపోవడం .. పోలీసులకు అనుమానాలు కలిగిస్తోంది. అదర్ చనిపోయినప్పుడు మరొక ఖైదీ కూడా అక్కడే ఉన్నాడు. ఫోరెన్సిక్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. జైలు నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఖైదీలు మొత్తం బ్యారక్ లలోనే ఉంటారు. బ్యారక్ లు తెరిచిన తర్వాత జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. అందులో గుర్జర్ మృతదేహం కనిపించింది. అయితే ఇతడిని భరత్పూర్ ప్రాంతానికి చెందిన కరడుగట్టిన హంతకుడు విష్ణు చంపాడని తెలుస్తోంది. అతడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.గుర్జర్ ఉన్న బ్యారక్ లోనే విష్ణు ఉండటం పోలీసులు అనుమానాలకు కారణం.

Exit mobile version