దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమలహాసన్ కాంబినేషన్లలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ ‘ఇండియన్2’. చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ‘ఇండియన్2’ షూటింగ్ చేస్తుండగా భారీ క్రేన్ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పొడక్షన్ అసిస్టెంట్స్ మధు(29), చంద్రన్ (60), సహాయ దర్శకుడు కృష్ణ(34) మృతిచెందగా 10మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కమలహాసన్ ట్వీట్లర్లో స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని భావోద్వేగానికి గురయ్యాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
‘ఇండియన్-2’ మూవీ తెలుగులో ‘భారతీయుడు-2’ పేరుతో తెరకెక్కుతుంది. ఈ మూవీలో కమలహాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతీసింగ్ నటిస్తున్నారు. కాజల్ ఇందులో 60ఏళ్ల భామగా కనిపించనుందని సమాచారం. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న నజరేత్ పేట్ పోలీసులు అక్కడి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.