Chiranjeevi : నాకు క్యాన్సర్ అంటూ తప్పుడు ప్రచారం.. నిజం చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. వైరల్ ట్వీట్
కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితమే నానక్ రామ్ గూడలో ఒక క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ఆయన క్యాన్సర్ అవగాహనా తెలుసుకోవడం వల్లే జరిగే లాభాలను చెప్తూ తనకి గతం లో జరిగిన ఒక సంఘటన ని చెప్పుకొచ్చాడు.
గతం లో నాకు కూడా క్యాన్సర్ వచ్చిందని, ఆ విషయాన్నీ నేను వెంటనే పసిగట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవడం తో క్యాన్సర్ బారి నుండి బయటపడ్డాను అని, క్యాన్సర్ ని ముందుగా పసిగడితే అది పెద్ద రోగమేమి కాదని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడాడు. ఈ విషయం పై సోషల్ మీడియా లో ‘చిరంజీవి కి క్యాన్సర్ వచ్చింది’ అంటూ ప్రచారం చెయ్యడం ప్రారంభించారు, అభిమానులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. మా మెగాస్టార్ చిరంజీవి కి ఏమైంది అంటూ సోషల్ మీడియా సాక్షిగా ఏడ్చేశారు. అయితే మీడియా లో వస్తున్న ఈ వార్తలను గమనించిన చిరంజీవి వెంటనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘కాసేపటి క్రితమే నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.
ఆయన మాట్లాడుతూ ‘కాసేపటి క్రితమే నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది.
అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
