OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / ఆంధ్రప్రదేశ్ / చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

Published by Neelambaram On Monday, 27 July 2020, 20:04


ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన అనంతరం ఆంధ్రపదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో అధికారం చేపట్టిన టిడిపి ప్రభుత్వం తుళ్ళూరు కేంద్రంగా 29 గ్రామాలను ఎంపిక చేసి రాజధానిగా ప్రకటించింది. ఇక్కడి రైతులు కొందరు స్వచ్ఛందంగా తమ భూములు ఇవ్వగా మారి కొందరు బెదిరింపులకు జడిసి భూములు ఇవ్వగా… మొత్తం 32 వేల ఎకరాలను భూసమీకరణ పథకంలో ప్రభుత్వం సమీకరించింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు అవలంభించిన తీరే ఇప్పడు అమరావతికి శాంపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వాధన. చంద్రబాబు రాజధాని విషయంలో అనుసరించిన వ్యూహాలు, చేపట్టిన పనులు, కల్పించిన ప్రచారం… ఇలా అన్ని విషయాలు అమరావతి మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. ఫలితంగా ఇప్పడు అక్కడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

Also Read: వాళ్లకు జగన్ వద్దు, బాబే ముద్దు ..!

రాజధాని పేరుతో రాజకీయంగా లబ్ధిపొందాలని చంద్రబాబు వ్యూహం పన్నారు. అమరావతి నిర్మాణానికి 2016లో ప్రారంభమయై 2050 నాటికి పూర్తయ్యేటట్లు అతి భారీ ప్రణాళిక వేశారు, రూ.5 లక్షల కోట్లు వ్యయంతో నవ నగరాలను నిర్మించాలని భావించారు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2050 వరకూ చంద్రబాబే సిఎంగా కొనసాగుతాడా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించారు. రాజధానిని అడ్డుపెట్టుకుని 2050 వరకూ పాలన హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు వ్యూహం, అయినప్పటికీ ప్రజలు దీనికి మద్దతు ఇవ్వలేదు. కనీసం రాజధాని వాసులు కూడా ఇందుకు అంగీకరించలేదు. 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పరాజయం పాలయ్యింది.

ఇంత భారీ స్థాయిలో ప్రణాళికలు చేపట్టిన చంద్రబాబు గడచిన ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించింది కేవలం రూ.9,600 కోట్లు మాత్రమే, ఇందులో రూ.1,500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకే అధిక మొత్తం ఖర్చు చేయడం వల్ల రాజధానిలో భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కోసం రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేశారు. భారీ ప్రణాళికతో ముందుకెళ్లడంతో ఇప్పటికీ రాజధానికి ఒక రూపు రేఖ లేకుండా పోయింది. కేవలం పాలనా పరమైన రాజధాని నిర్మణం గత ఐదేళ్లలో అమరావతిలో పూర్తి చేసి దశల వారీగా రాజధానిని విస్తరించే ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసి ఉంటే అమరావతి నుంచి రాజధానిని మార్చడానికి అవకాశం ఉండేది కాదనే వాధనలు వినిపిస్తున్నాయి.

స్వతహాగా పబ్లిసిటీ అతిగా కోరుకునే చంద్రబాబు రాజధాని విషయంలోను అతిగా పబ్లిసిటీ చేశారు. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇతర దేశాలతోనే రాజధానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో ఒప్పందాలు కుదర్చుకోవడం, మాస్టర్ ప్లాన్ రూపలక్పన, రాజధాని అభివృద్ధి, ఇతర అంశాలకు సంబంధించి సింగపూర్, జపాన్ సంస్థలకు ఆయన పనులు అప్పగించారు. ప్రతి ఏటా దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించి సీఆర్డీఏ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. చివరికి అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి… అనే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇది ప్రభుత్వ వ్యవహారంగా సాగకుండా సొంత ఇమేజ్ కోసం ప్రయత్నం చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతుంది. టిడిపి వ్యతిరేక ప్రభుత్వాలు ఇటువంటి అంశాన్ని ఎలా కొనసాగిస్తాయని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాదును తానే నిర్మించానని ప్రతి వేదికపైనా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నిజాం నవాబు నుంచి రాజశేఖర్ రెడ్డి వరకూ పాలకులెవరూ హైదరాబాదును అభివృద్ది చేయాలేదా?

రాజధాని అమరావతి విషయంలో సామాజిక వర్గం ముద్ర పడుతుంటే ముందు నుంచి చంద్రబాబు ఆ ముద్రను తొలగించ లేకపోయారు. భూ సమీకరణ విషయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్ద రైతులు ముందుండి వ్యవహారాన్ని నడిపించారు. పలు మార్లు హైదరాబాదులో ఉన్న చంద్రబాబు వద్దకు ప్రత్యేక బస్సుల్లో రైతులను తీసుకువెళ్లి సమావేశ పర్చడంలో ఆ వర్గం వారే ఉన్నారు. భూ సమీకరణకు భూములు ఇచ్చిన వారిలో అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నా… రాజధాని ప్రకటించక ముందు, అనంతరం అక్కడ భూములను ఆ సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్నే ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా వాడుకుంటుంది.

Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఏ రోజు ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లలేదు. అఖిల పక్షం సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు నెత్తి నోరు మొత్తుకున్నా వినలేదు. రాజధాని విషయంలో ఇతర పార్టీలను జోక్యం చేసుకోనివ్వలేదు. మాస్టర్ ప్లాన్, నిర్మాణం, ఇతర విషయాలలో ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించలేదు. అందరి భాగస్వామ్యం తీసుకుని అమరావతి అందరిదీ అనే భావన కలిగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనే విషయాన్ని విపక్ష పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అధికారం పోయిన అనంతరం అమరావతి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పోరాటం చేయాలని ఇప్పడు చంద్రబాబు కోరుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలను గుర్తించి అటువంటి అవకాశాలు లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం, అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవడం వంటి విషయాలలో చంద్రబాబు ముందు చూపు లేకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ప్రభుత్వం భలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజకీయ కారణాలతో అమరావతిని రాజధానిగా అంగీకరించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో పాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధాని గా నిర్ణయించింది. చంద్రబాబు చేసిన చట్టాలు వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలించకుండా అడ్డుకోలేకపోయాయి. దీంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా ముందుకు వెళుతుంది.

లైఫ్ స్టైల్

BGT 2023 Aus vs IND Test Series : మ్యాచ్ స్ట్రాట్ యే కాలేదు.. అప్పుడే నాగపూర్ పిచ్ పై లొల్లి షురూ చేసిన ఆస్ట్రేలియా మాజీలు-మీడియా

Kohli: అతడి బౌలింగ్ లో ఆడడం చాలా కష్టమంటున్న కోహ్లీ

RBI: లోన్లు తీసుకున్న వారికి శుభవార్త ఇదీ

Ravi Shastri- Mohammed Shami: మటన్ రైస్ తింటున్న మహ్మద్ షమీ ప్లేట్ లాగేసి తిట్టిన రవిశాస్త్రి.. వెలుగులోకి షాకింగ్ నిజం

Money Astrology: మీ పర్సులో ఇది ఉంచుకుంటే ఎన్నో లాభాలు తెలుసా?

Husband And Wife Relationship: భార్యను ఎలా చూసుకోవాలో తెలుసా?

Border Gavaskar Trophy History: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర ఇదీ: ఇప్పటివరకూ ఇండియా దే పై చేయి

Border Gavaskar Trophy 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: స్పిన్ పిచ్ లు తయారు చేస్తే ఇండియాకి కూడా ఇబ్బందేనా?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

S. Varalakshmi- Senior NTR: ఆ స్టార్ హీరోయిన్ ని కోడలా అని ఆప్యాయంగా పిలుచుకున్న ఎన్టీఆర్… కారణం తెలుసా!

Kamal Haasan- Balakrishna: అక్కడ కమల్ హాసన్..ఇక్కడ బాలయ్య బాబు..అభిమానులకు పూనకాలు రప్పిస్తున్న వార్త

Unstoppable With NBK- NTR And Kalyan Ram: బాలయ్య షో కి జూ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. కలవనున్న నందమూరి ఫ్యామిలీ

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

‘Amigos’ First Review : కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మొట్టమొదటి రివ్యూ..

Kalyan Ram Amigos : 14 రాత్రుళ్లు చేస్తే కానీ బయటపడని కళ్యాణ్ రామ్ లో రొమాంటిక్ యాంగిల్

Liger – Charmi : లైగర్ ఎఫెక్ట్ : తినడానికి కూడా డబ్బులు లేకుండా హీరోయిన్ ఛార్మి పాట్లు

SIR -Movie Official Trailer : సార్ మూవీ ట్రైలర్ రివ్యూ: పేదోడి చదువు కోసం సార్ పోరాటం!

Young Woman Married Old Man: 24 ఏళ్ల భార్యకు కడుపు చేయడమే 85 ఏళ్ల భర్తకు పెద్ద టాస్క్.. చివరికిలా

Unstoppable With NBK Chiranjeevi: ‘అన్ స్టాపబుల్’ షో కి ఎంత బ్రతిమిలాడినా రాని ఏకైక స్టార్ హీరో అతనేనా?

మరిన్ని చదవండి ...

గాసిప్

Rana Naidu : స్టార్ హీరోలైన వెంకటేష్ – రానాలకు ఏంటి దుస్థితి

Srinu Vaitla : ఆ ఇద్దరి వల్లే శ్రీను వైట్ల కెరీర్ సర్వనాశనం అయ్యిందా!

Dil Raju vs Allu Aravind : మోసం చేయాలనుకున్న దిల్ రాజుకి కనుసైగతోనే వణుకుపుట్టేలా చేసిన అల్లు అరవింద్

Parusharam : ఇంతటి అత్యాశ అవసరమా డైరెక్టర్ మహాశయా!

K Vishwanath : విశ్వనాథ్, చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం వరుసకు సోదరులే.. కానీ ట్విస్ట్ ఇదే

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

TANA : తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

Nara Lokesh Birth Day : యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TANA : తానా ఆధ్వర్యంలో బాపట్ల నాగులపాలెంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap