‘బ్రాండ్ తెలంగాణ’:రైతులకు శుభవార్త చెప్పిన కెసిఆర్
తెలంగాణ అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రాండ్ తెలంగాణ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుడ్ ప్రాసెసింగ్ (కల్తీలేని ఆహార పదార్థాల తయారీ) యూనిట్లును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రయ విక్రయాలు జరుపుతారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రాథమిక నివేదికలు, ప్రణాళికలు జిల్లాల కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. “బ్రాండ్ తెలంగాణ”తో […]

తెలంగాణ అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రాండ్ తెలంగాణ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుడ్ ప్రాసెసింగ్ (కల్తీలేని ఆహార పదార్థాల తయారీ) యూనిట్లును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రయ విక్రయాలు జరుపుతారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రాథమిక నివేదికలు, ప్రణాళికలు జిల్లాల కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు.
“బ్రాండ్ తెలంగాణ”తో చేకూరే ప్రయోజనాలు
- అంతర్జాతీయ ప్రమాణాలతో సరుకుల తయారీ
- కల్తీలేని ఆహార పదార్థాల తయారీ కేంద్రాల ఏర్పాటు
- దేశ, విదేశాలకు ఎగుమతి
- రేషన్ డీలర్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా
- పంటలవారీగా జిల్లాల్లో పరిశ్రమల స్థాపన
- మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రయవిక్రయాలు
- యువతకు ఉపాధి అవకాశాలు