OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / వైరల్ / Bharat Gaurav Train AP: ఏపీ నుంచి కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్.. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ వరం

Bharat Gaurav Train AP: ఏపీ నుంచి కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్.. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ వరం

Published by SS On Sunday, 19 March 2023, 12:18

Bharat Gaurav Train AP

Bharat Gaurav Train AP

Bharat Gaurav Train AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ పథకాలను ప్రారంభిస్తోంది. రైల్వే విభాగం నుంచి ఇప్పటికే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందించి రెండు రాష్ట్రాల ప్రజల మన్నలను పొందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ గౌరవ్’ రైలును తెలుగు రాష్ట్రాలకు అందించారు. ఈ రైలును శనివారం దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణించారు. ఇక్కడి నుంచి ఈ రైలు పూరీ, కాశీ, అయోధ్య మీదుగా ప్రయాగ వరకు వెళ్తుంది. 18న ప్రారంభమైన ఈ రైలు 26వ తేదీ వరకు అంటే 8 రాత్రుళ్లు, 9 పగళ్లు నడుస్తుంది.

భారత్ గౌరవ రైలు ప్రారంభం సందర్భంగా రైలులో ప్రయాణించేవారికి కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం ఐఆర్ సీటీసీ చైర్మన్, ఎండీ రజనీ హసీజా, ఇతర అధికారులతో కలిసి జీఎం అరుణ్ కుమార్ జైన్ యాత్రికులను స్వాగత కిట్ లు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలోనే ‘గౌరవ్’ రైలు ఆగుతుంది. ఆ తరువాత పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెళ్తుంది. పర్యాటకుల ఆసక్తితో పాటు పుణ్య క్షేత్రప్రదేశాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని మొత్తం పర్యటన ప్రయాణ ప్రణాళిక ను రూపొందించినట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు.

Bharat Gaurav Train AP

Bharat Gaurav Train AP

‘గౌరవ్ రైలు’లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ పర్యాటక రైలులో ప్రయాణించేవారికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైలు, రోడ్డు రవాణాతో సహా వసతి, క్యాటరింగ్ సౌకర్యాలు కల్పించారు. వీటిలో భాగంగా ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. అనుభవం కలిగిన వారితో అందరికీ నచ్చే లా స్నేహపూర్వక సేవలు అందిస్తారు. అన్ని కోచ్ లల్లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా యాత్రికులకు ప్రయాణ బీమాను ఏర్పాటు చేయనున్నారు.

పుణ్యక్షేత్రాలను సందర్శించే ఈ రైలు పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగలోని ముఖ్యమైన, చారిత్రక కట్టడాలను సందర్శిస్తుంది. ఇలా 8 రాత్రలు 9 పగలు ప్రయాణిస్తుంది. ఈ రైలులోని ప్రయాణికుల డిమాండ్లకు అనుగుణంగా ఏసీ, నాన్ ఏసీ, కోచ్ లను కూడా ఏర్పాటు చేసింది. తొలి రైలులో ఎక్కేందుకు తెలుగువారు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. రైలులో ఉన్న 700 సీట్లను ముందే బుక్ చేసుకున్నారు.

ఇక దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, వైజాగ్ ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టి ఆకట్టుకుంది. తాజాగా ఏపీ నుంచి ఉత్తరాధి పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు ‘గౌరవ్’ రైలును ప్రవేశపెట్టడంతో ప్రధాని మోదీపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల వరకు మరిన్ని పథకాలు వస్తాయని తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు చెబుతున్నారు.

లైఫ్ స్టైల్

Ugadi 2023: ఉగాది తెలుగు పండగ: ఈరోజు ఏం చేయాలంటే..

Chapati: రాత్రిపూట చపాతీ తినేవారంతా ఇది గమనించాల్సిందే

Zodiac Signs: ఉగాది నుంచి ఈ ఐదు రాశుల వారికి శని పడుతుందట?

Goddess Lakshmi: ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో లక్ష్మీయోగం రావడం ఖాయమే?

Shikhar Dhawan: టీంలో చోటు లేక పాపం శిఖర్ ధావన్‌కు ఎంత దుస్థితి వచ్చే.. ఆఖరుకు ఇలా..!

Ugadi 2023: ఉగాది రోజు వీటిని కొంటే డబ్బే డబ్బు..

Astrology: రాహు, కేతువుల దృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?

India Vs Australia 3rd Odi: ఆసీస్ తో మూడో వన్డే: భారత జట్టులో ఈ కీలక మార్పులు తప్పవా?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Tarakaratna Wife Alekhya Reddy: ఇల్లు లేక తారకరత్న కార్లలో నిద్రించిన రోజులు ఉన్నాయా..? వైరల్ అవుతున్న అలేఖ్య రెడ్డి కామెంట్స్

Aha Naa Pellanta: అప్పటి ముచ్చట్లు : అహనా పెళ్లంట.. 16 లక్షలతో సినిమా తీస్తే ఎంత వసూలైందో తెలుసా?

Kishore Kumar-Madhubala : మరణంతో ముగిసిన ప్రేమ… కిషోర్ కుమార్-మధుబాల బంధం ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ కావ్యం!

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Chiranjeevi Bholaa Shankar : అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

Anasuya Bharadwaj: బటన్స్ లేని జాకెట్లో వంగి వంగి పరువాలు చూపించిన అనసూయ… ఏం అందంరా బాబు!

Ugadi 2023: ఉగాది తెలుగు పండగ: ఈరోజు ఏం చేయాలంటే..

Rajamouli- Kanchana: రాజమౌళి డబ్బుల కోసం నన్ను అవమానించాడు… సీనియర్ నటి కాంచన సీరియస్ ఆరోపణలు!

Goddess Lakshmi: ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో లక్ష్మీయోగం రావడం ఖాయమే?

Kajal Aggarwal Son: కాజల్ అగర్వాల్ కొడుకు క్రేజ్ మామూలుగా లేదుగా..విమానాశ్రయం దద్దరిల్లింది!

మరిన్ని చదవండి ...

గాసిప్

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండతో ఒకే గదిలో సమంత… రష్మికకు బ్రేకప్ చెప్పి కొత్త ఎఫైర్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో!

Samantha – Naga Chaitanya :నాగ చైతన్య కారణంగా సమంతకు అబార్షన్, తిడుతూ కొడుతూ వేధించిన అక్కినేని హీరో!

Kavitha – KCR – KTR : ప్రగతిభవన్ కు కవిత.. హరీష్, కేటీఆర్ కూడా అక్కడే… ఏం జరుగుతోంది?

Padmavathi – Telangana Ministers : ప్రత్యర్థులకు పిలుపు.. బీఆర్ఎస్ మంత్రులకు ఉత్తంకుమార్ రెడ్డి సతీమణి ఆతిథ్యం వెనుక కథేంటి?

Oscar award : ఆస్కార్ అవార్డుని దేనితో తయారు చేస్తారు..? అమ్మితే వచ్చే డబ్బులు ఎంతో తెలుసా!

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA Women’s Day : ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TANA Women’s day : ఉమెన్స్ డే : చికాగోలో “తానా”తరంగం.. తెలుగు ఆడపడుచుల పండగ వైభవం

Kaleshwaram: త్రివేణి సంగమం.. త్రిలింగ క్షేత్రం.. కాళేశ్వరం..!

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap