దాదాపు ఇటీవల వెల్లడైన సర్వేలన్నీ కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలో వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెల్లడైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారమని తేల్చి చెబుతున్నాయి.
దేవధర్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్, నార్త్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ సోమవారం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కునాల్ (70), మయాంక్ అగర్వాల్(64), జగదేశన్ (72) అర్థ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో మార్కండే, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక లక్ష్య సాధనలో నార్త్ జోన్ జట్టు కేవలం 60 కరుగులకే కుప్ప కూలింది. జట్టులో ఖజూరియా(10), మందీప్ సింగ్(18) మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. కావేరప్ప 5 వికెట్లతో చెలరేగి నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు.
కర్ణాటకలో మారిన వాతావరణం నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కీలక ఆటగాడిగా ఎదిగాడు. 24 ఏళ్ల వయసు ఉన్న ఎంబాపె ఇప్పటి వరకు 66 మ్యాచుల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్ధులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సామర్థ్యం ఈ ఆటగాడి సొంతం. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరుతో ఫ్రాన్స్ జట్టును ఫైనల్ కు చేర్చాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్ లో బెంగళూరు జట్టు కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ భార్య గర్భం దాల్చింది. మ్యాక్స్ వెల్ భార్య వినీ రామన్ కు ఈ మధ్య ఏడు నెలలు నిండాయి. దీంతో మ్యాక్స్ వెల్ తన భార్యకు దక్షిణ భారతదేశంలో నిర్వహించే సాంప్రదాయ సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించాడు. అచ్చమైన చీరకట్టు, బొట్టులో వినీ రామన్ ను మహాలక్ష్మిలా ముస్తాబు చేసి ఈ వేడుకను నిర్వహించారు.
కోట్లాదిమంది అభిమానుల ఆదరణను పొందుతున్న ఐపీఎల్ లో మరిన్ని మార్పులు చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాంచైజీలు ఆటగాళ్ల కోసం వెచ్చించే మొత్తాన్ని భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ప్రాంచైజీల పర్సు వ్యాల్యూను 100 కోట్లకు పెంచాలని బిసిసిఐ భావిస్తోంది. వచ్చే ఐపీఎల్ కోసం ఈ ఏడాది చివర్లో మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో ప్రాంచైజీలు అన్నీ కూడా కొత్త పర్సు విలువలతో వేలం బరిలో దిగనున్నాయి.
దురదృష్టవంతులైన క్రికెటర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు అంబటి రాయుడు. 2019 ప్రపంచ కప్ కు ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి సత్తా చాటాడు. కానీ, సెలక్టర్లు రాయుడును జట్టు నుంచి తొలగించారు.
ఓల్డ్ ట్రఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టును విజయం ఊరించి ఉసూరుమనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 592 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ పరుగులను సాధించగలిగింది. భారీ పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 317 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా తన చిరకాల స్నేహితురాలు అయిన నికోల్ ను ఎయిడెన్ మార్క్రమ్ వివాహం చేసుకున్నాడు.
గెలుపోటములతో సంబంధం లేకుండా టెస్టుల్లో వేగంగా ఆడడం ద్వారా ఈ ఆటకు మరింత ఆదరణ పెరిగేలా చేయడంలో మాత్రం బ్రెండన్ మెక్ కల్లమ్ తోపాటు ఇంగ్లాండ్ జట్టు సఫలం అయిందనే చెప్పాలి.